2022లో జరిగే ఫిఫా ప్రపంచకప్ చూడాలనే అభిమానులకు.. కొత్త నిబంధన పెట్టింది ఖతార్. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఈ టోర్నీకి అనుమతించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని అబ్దులాజీజ్ అల్ థానీ ధ్రువీకరించారు. అయితే ఈ టోర్నీని ప్రేక్షకుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఫిఫా అధ్యక్షుడు వెల్లడించారు.
2022 నవంబర్లో నాలుగు వారాల పాటు సాకర్ ప్రపంచకప్ నిర్వహించనుంది ఈ గల్ఫ్ దేశం. అందుకోసం ముందు జాగ్రత్తగా పది లక్షల కొవిడ్ డోసులను సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఆ సమయానికి చాలా దేశాలు తమ పౌరులకు టీకా పంపిణీ చేసే అవకాశం ఉంది. అయినా ఈ మెగా ఈవెంట్ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి: మైదానంలోనే కుప్పకూలిన ఫుట్బాల్ ఆటగాడు