స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో.. తన ఆటతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అతడిపై ఉన్న ఇష్టానికి గుర్తుగా, రొనాల్డో లైఫ్ సైజ్ చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేశాడు జార్జ్ కర్డాసో అనే ఓ శిల్పి. ఈ మంగళవారమే ఆవిష్కరించారు. రొనాల్డో స్వస్థలం పోర్చుగల్లోని ఓవర్లో జరుగుతున్న కార్నివాల్లో ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచారు.
జార్జ్.. చాక్లెట్తో విగ్రహాలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇంతకు ముందు 2018లో కళాత్మక చాక్లెట్ శిల్పాల తయారీ పోటీలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ఓవర్లో పుట్టిన ఇతడు ప్రస్తుతం స్విట్జర్లాండ్లో నివాసముంటున్నాడు.
200 గంటలు.. 17 గంటల ప్రయాణం
రొనాల్డో విగ్రహాన్ని దాదాపు 120 కిలోల చాక్లెట్తో 187 సెంటీమీటర్ల ఎత్తుతో తయారు చేశాడు జార్జ్. దాదాపు 200 గంటలు(9 రోజులు) కష్టపడ్డాడు. అనంతరం స్విట్జర్లాండ్ నుంచి ఓవర్కు తెచ్చేందుకు సుమారు 17 గంటల ప్రయాణం చేసి, ఈ శిల్పాన్ని పోర్చుగల్లో జరుగుతున్న కార్నివాల్కు తీసుకొచ్చారు.
ఓవర్ నగరంలో జరుగుతున్న సంప్రదాయ కార్నివల్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ తర్వాత మడైరాలోని రొనాల్డో సొంత మ్యూజియానికి ఈ విగ్రహాన్ని తరలిస్తారు.
ఇదీ చూడండి.. కివీస్పై గెలుపుతో ప్రపంచకప్ సెమీస్కు భారత్