ETV Bharat / sports

మీరే కెప్టెన్​లా ముందుండి నడిపించాలి: కోహ్లీ

కరోనా సంక్షోభం వేళ ప్రతి ఒక్కరూ నాయకుడిలా వ్యవహరించి, చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు ఆర్​సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. వైరస్​ ఉద్ధృతంగా మారుతోన్న నేపథ్యంలో కోహ్లీతో పాటు జట్టు సహచరులు ఈ మేరకు ట్విట్టర్​లో ప్రజలకు విన్నవించారు.

author img

By

Published : Apr 25, 2021, 2:25 PM IST

ABD, Kohli and Maxwell urge people to stay home
కెప్టెన్​లా ముందుండి నడిపించాలి: కోహ్లీ

దేశంలో రెండో దశ కరోనా నానాటికీ ప్రాణాంతకంగా మారుతోన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు క్రికెటర్లు. వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. వారిలో సారథి విరాట్ కోహ్లీ సహా విధ్వంసకర బ్యాట్స్​మెన్​ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్​వెల్ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆర్​సీబీ యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతా​లో పోస్ట్ చేసింది.

  • Stay Home. Stay Safe.

    The only way to beat the Coronavirus pandemic is by working as a team. Each one of us is a superhero and all we need to do is follow the basics and help each other. Here’s Virat Kohli and Co. with a public service announcement.#PlayBold #StayHomeStaySafe pic.twitter.com/jQT9q15N5j

    — Royal Challengers Bangalore (@RCBTweets) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హాయ్.. నేను విరాట్ కోహ్లీ. ఒక కెప్టెన్​గా నేను ముందుండి నడిపిస్తాను. చుట్టూ ఉన్నవాళ్లకు సహకరిస్తాను. మీరందరు కూడా అలాగే చేయాలని కోరుతున్నా. చేతులను శుభ్రపరచుకోండి. అవసరమైతేనే బయటకు వెళ్లండి. అన్ని వేళలా మాస్కులు ధరించండి."

- విరాట్ కోహ్లీ, ఆర్​సీబీ కెప్టెన్

సూపర్​ హీరోలా..

భారత్​లో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 3,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 2,767 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో మనమే సూపర్​హీరోలా ఉండి, వైరస్​ నుంచి బయటపడాలని కోరాడు ఏబీడీ.

"హాయ్.. నేను ఏబీ డివిలియర్స్. ఆపత్కాలంలో సూపర్​హీరో కోసం ఎదురుచూడలేం. మీరే సూపర్​హీరోగా మారాలి. మహమ్మారి వేళ ఇంట్లో ఉండటం ద్వారానే సురక్షితంగా ఉండగలం. అందరం కలిసికట్టుగా దీని నుంచి బయటపడదాం."

- ఏబీ డివిలియర్స్

"మీకు వినోదం, సంతోషాన్ని ఇవ్వడమే మా ప్రాధాన్యం. బదులుగా, అందరూ జాగ్రత్తగా ఉండి, కొవిడ్​ను జయించాలని కోరుతున్నా." అని మ్యాక్స్​వెల్ అన్నాడు.

ఇదీ చూడండి: సీఎస్కేxఆర్సీబీ: ఆధిపత్యం కొనసాగించేది ఎవరో?

దేశంలో రెండో దశ కరోనా నానాటికీ ప్రాణాంతకంగా మారుతోన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు క్రికెటర్లు. వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. వారిలో సారథి విరాట్ కోహ్లీ సహా విధ్వంసకర బ్యాట్స్​మెన్​ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్​వెల్ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆర్​సీబీ యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతా​లో పోస్ట్ చేసింది.

  • Stay Home. Stay Safe.

    The only way to beat the Coronavirus pandemic is by working as a team. Each one of us is a superhero and all we need to do is follow the basics and help each other. Here’s Virat Kohli and Co. with a public service announcement.#PlayBold #StayHomeStaySafe pic.twitter.com/jQT9q15N5j

    — Royal Challengers Bangalore (@RCBTweets) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హాయ్.. నేను విరాట్ కోహ్లీ. ఒక కెప్టెన్​గా నేను ముందుండి నడిపిస్తాను. చుట్టూ ఉన్నవాళ్లకు సహకరిస్తాను. మీరందరు కూడా అలాగే చేయాలని కోరుతున్నా. చేతులను శుభ్రపరచుకోండి. అవసరమైతేనే బయటకు వెళ్లండి. అన్ని వేళలా మాస్కులు ధరించండి."

- విరాట్ కోహ్లీ, ఆర్​సీబీ కెప్టెన్

సూపర్​ హీరోలా..

భారత్​లో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 3,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 2,767 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో మనమే సూపర్​హీరోలా ఉండి, వైరస్​ నుంచి బయటపడాలని కోరాడు ఏబీడీ.

"హాయ్.. నేను ఏబీ డివిలియర్స్. ఆపత్కాలంలో సూపర్​హీరో కోసం ఎదురుచూడలేం. మీరే సూపర్​హీరోగా మారాలి. మహమ్మారి వేళ ఇంట్లో ఉండటం ద్వారానే సురక్షితంగా ఉండగలం. అందరం కలిసికట్టుగా దీని నుంచి బయటపడదాం."

- ఏబీ డివిలియర్స్

"మీకు వినోదం, సంతోషాన్ని ఇవ్వడమే మా ప్రాధాన్యం. బదులుగా, అందరూ జాగ్రత్తగా ఉండి, కొవిడ్​ను జయించాలని కోరుతున్నా." అని మ్యాక్స్​వెల్ అన్నాడు.

ఇదీ చూడండి: సీఎస్కేxఆర్సీబీ: ఆధిపత్యం కొనసాగించేది ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.