ETV Bharat / sports

WTC Final: ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇలానా.. ఇదేం ముగింపు అసలు

author img

By

Published : Jun 24, 2021, 7:30 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్(World Test Championship)​ విజేతగా న్యూజిలాండ్(Newzeland) నిలిచింది. అయితే టీమ్​ఇండియాతో ఫైనల్​ సాగిన తీరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ అభిమానులను నిరుత్సాహపరిచింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీకి ఇలాంటి ముగింపు ఏంటిరా బాబు అని అనుకుంటున్నారు.

WTC FINAL
కోహ్లీ

వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్ ఉన్నట్లే టెస్టుల్లోనూ ప్రపంచ సమరం ఉండాలనే దశాబ్దాల ఆలోచనకు 2019లో శ్రీకారం చుట్టి.. దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘ కాలం టెస్టు జట్ల మధ్య సిరీస్​లు నిర్వహించి.. ఈ కాలంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ టైటిల్ కోసం తుదిపోరుకు రంగం సిద్ధం చేసింది ఐసీసీ. అయితే ఇంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సాగిన తీరు క్రికెట్ అభిమానులకు తీవ్ర అసహనమే కలిగించి ఉంటుంది. ఇక భారత అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు.

ఈ సమయంలో బాగా వర్షాలు పడే సౌథాంప్టన్ ఫైనల్​కు వేదికగా ఎంచుకోవడం సరైన నిర్ణయమేనా అన్న సందేహాలు ముందు నుంచే ఉండగా.. అందుకు తగ్గట్లే మ్యాచ్​కు వరుణుడు తీవ్ర స్థాయిలోనే ఆటంకం కలిగించాడు. తొలి నాలుగు రోజుల్లో కేవలం ఒకటిన్నర రోజుల ఆట మాత్రమే సాగడం వల్ల ఫైనల్ మీద ఆసక్తి సన్నగిల్లిపోయింది. అసలే టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్ ముందు సరైన ప్రాక్టీస్ లేదు. క్వారంటైన్​లో సుదీర్ఘ సమయం గడపాల్సిరావడం వల్ల సరైన ప్రాక్టీస్ లేకపోయింది. అదే సమయంలో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ ఆడింది. రెండు జట్ల సన్నద్ధతలో ఎంత తేడానో!

INDIA VS NEW ZEALAND FINAL
ట్రోఫీతో న్యూజిలాండ్

ఇలాంటి స్థితిలో మ్యాచ్లో అడుగుపెడితే.. వరుణుడి 'ఆట' కోహ్లీసేన మానసిక స్థితిని మరింతగా దెబ్బతీసింది. కివీస్ ఆటగాళ్లు కూడా ఇవే పరిస్థితులు ఎదుర్కొ న్నప్పటికీ.. వాళ్లకు ఇవి అలవాటే. న్యూజిలాండ్​కు దగ్గరగా ఉండే ఇంగ్లాండ్​లో ఫైనల్ జరగడం వారికి అతి పెద్ద సానుకూలాంశం. పైగా మ్యాచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి స్పిన్నర్​కు అవకాశం ఇవ్వకుండా ఐదుగురు పేసర్లను ఎంచుకోవడం ఆ జట్టు పైచేయి సాధించడానికి తోడ్పడింది. మ్యాచ్​కు ముందురోజు వరకు ఎండ కాస్తుండటం వల్ల భారత్ ఇద్దరు స్పిన్నర్లకు తుది జట్టులో చోటివ్వగా.. మ్యాచ్ రోజు నుంచి వరుణుడి ప్రతాపం మొదలై పేసర్ల రాజ్యమే నడిచింది. నాలుగో పేసర్ లేకపోవడం ఒకలోటైతే.. ప్రధాన పేసర్ బుమ్రా వైఫల్యం భారత్​ను గట్టి దెబ్బేతీసింది. న్యూజిలాండ్ ఘనతను తక్కువ చేయడానికేమీ లేదు కానీ.. భారత్​కు డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు, మ్యాచ్ జరుగుతున్నపుడు ఏదీ కలిసి రాలేదన్నది వాస్తవం. వరుణుడి ఆటంకాల మధ్య అనిశ్చిత వాతావరణంలో, గందరగోళ పరిస్థితుల్లో సాగిన మ్యాచ్​లో గెలవడం కివీస్​కూ అంతసంతృప్తినిచ్చి ఉండకపోవచ్చు.

ఒకటి సరిపోతుందా?

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ విజేతను తేల్చడానికి ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించడం సరైందేనా అన్న చర్చ నడుస్తోందిప్పుడు. కొన్ని వారాల్లో ముగిసిపోయే వన్డే, టీ20 ప్రపంచకప్ చాంపియన్​షిప్ రెండేళ్ల పాటు సాగే టెస్టు ఛాంపియన్​షిప్​లో విజేతను మూడు మ్యాచ్​ల సిరీస్​లో నిర్ణయించాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అప్పుడు వర్షం పడినా.. ఒక మ్యాచ్ సజావుగా సాగకున్నా, ఒక మ్యాచ్ డ్రా అయినా ఇబ్బంది ఉండదని మాజీలు అంటున్నారు. మూడు మ్యాచ్​ల సిరీస్​లోనూ ఫలితం డ్రా అయ్యేందుకు అవకాశాలు లేకపోలేదు కానీ అప్పుడు విజేతను తేల్చడానికో విధానం తీసుకురావచ్చు. ఒక్క మ్యాచ్​తో పోలిస్తే ఇది మెరుగైన ప్రత్యామ్యాయమని, ఇంతటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి మూడు మ్యాచ్​ల సిరీస్​ ఉంటే ఆసక్తికర ముగింపు ఉంటుందని అంటున్నారు.

ఇవీ చదవండి:

వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్ ఉన్నట్లే టెస్టుల్లోనూ ప్రపంచ సమరం ఉండాలనే దశాబ్దాల ఆలోచనకు 2019లో శ్రీకారం చుట్టి.. దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘ కాలం టెస్టు జట్ల మధ్య సిరీస్​లు నిర్వహించి.. ఈ కాలంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ టైటిల్ కోసం తుదిపోరుకు రంగం సిద్ధం చేసింది ఐసీసీ. అయితే ఇంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సాగిన తీరు క్రికెట్ అభిమానులకు తీవ్ర అసహనమే కలిగించి ఉంటుంది. ఇక భారత అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు.

ఈ సమయంలో బాగా వర్షాలు పడే సౌథాంప్టన్ ఫైనల్​కు వేదికగా ఎంచుకోవడం సరైన నిర్ణయమేనా అన్న సందేహాలు ముందు నుంచే ఉండగా.. అందుకు తగ్గట్లే మ్యాచ్​కు వరుణుడు తీవ్ర స్థాయిలోనే ఆటంకం కలిగించాడు. తొలి నాలుగు రోజుల్లో కేవలం ఒకటిన్నర రోజుల ఆట మాత్రమే సాగడం వల్ల ఫైనల్ మీద ఆసక్తి సన్నగిల్లిపోయింది. అసలే టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్ ముందు సరైన ప్రాక్టీస్ లేదు. క్వారంటైన్​లో సుదీర్ఘ సమయం గడపాల్సిరావడం వల్ల సరైన ప్రాక్టీస్ లేకపోయింది. అదే సమయంలో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ ఆడింది. రెండు జట్ల సన్నద్ధతలో ఎంత తేడానో!

INDIA VS NEW ZEALAND FINAL
ట్రోఫీతో న్యూజిలాండ్

ఇలాంటి స్థితిలో మ్యాచ్లో అడుగుపెడితే.. వరుణుడి 'ఆట' కోహ్లీసేన మానసిక స్థితిని మరింతగా దెబ్బతీసింది. కివీస్ ఆటగాళ్లు కూడా ఇవే పరిస్థితులు ఎదుర్కొ న్నప్పటికీ.. వాళ్లకు ఇవి అలవాటే. న్యూజిలాండ్​కు దగ్గరగా ఉండే ఇంగ్లాండ్​లో ఫైనల్ జరగడం వారికి అతి పెద్ద సానుకూలాంశం. పైగా మ్యాచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి స్పిన్నర్​కు అవకాశం ఇవ్వకుండా ఐదుగురు పేసర్లను ఎంచుకోవడం ఆ జట్టు పైచేయి సాధించడానికి తోడ్పడింది. మ్యాచ్​కు ముందురోజు వరకు ఎండ కాస్తుండటం వల్ల భారత్ ఇద్దరు స్పిన్నర్లకు తుది జట్టులో చోటివ్వగా.. మ్యాచ్ రోజు నుంచి వరుణుడి ప్రతాపం మొదలై పేసర్ల రాజ్యమే నడిచింది. నాలుగో పేసర్ లేకపోవడం ఒకలోటైతే.. ప్రధాన పేసర్ బుమ్రా వైఫల్యం భారత్​ను గట్టి దెబ్బేతీసింది. న్యూజిలాండ్ ఘనతను తక్కువ చేయడానికేమీ లేదు కానీ.. భారత్​కు డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు, మ్యాచ్ జరుగుతున్నపుడు ఏదీ కలిసి రాలేదన్నది వాస్తవం. వరుణుడి ఆటంకాల మధ్య అనిశ్చిత వాతావరణంలో, గందరగోళ పరిస్థితుల్లో సాగిన మ్యాచ్​లో గెలవడం కివీస్​కూ అంతసంతృప్తినిచ్చి ఉండకపోవచ్చు.

ఒకటి సరిపోతుందా?

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ విజేతను తేల్చడానికి ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించడం సరైందేనా అన్న చర్చ నడుస్తోందిప్పుడు. కొన్ని వారాల్లో ముగిసిపోయే వన్డే, టీ20 ప్రపంచకప్ చాంపియన్​షిప్ రెండేళ్ల పాటు సాగే టెస్టు ఛాంపియన్​షిప్​లో విజేతను మూడు మ్యాచ్​ల సిరీస్​లో నిర్ణయించాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అప్పుడు వర్షం పడినా.. ఒక మ్యాచ్ సజావుగా సాగకున్నా, ఒక మ్యాచ్ డ్రా అయినా ఇబ్బంది ఉండదని మాజీలు అంటున్నారు. మూడు మ్యాచ్​ల సిరీస్​లోనూ ఫలితం డ్రా అయ్యేందుకు అవకాశాలు లేకపోలేదు కానీ అప్పుడు విజేతను తేల్చడానికో విధానం తీసుకురావచ్చు. ఒక్క మ్యాచ్​తో పోలిస్తే ఇది మెరుగైన ప్రత్యామ్యాయమని, ఇంతటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి మూడు మ్యాచ్​ల సిరీస్​ ఉంటే ఆసక్తికర ముగింపు ఉంటుందని అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.