ETV Bharat / sports

రూ2వేల టికెట్ రెండున్నర లక్షలకు- సెమీస్ క్రేజ్​ను క్యాష్ చేసుకుందామని అడ్డంగా దొరికి!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 11:14 AM IST

Updated : Nov 14, 2023, 11:44 AM IST

World Cup 2023 Black Tickets : భారత్​ వర్సెస్ న్యూజిలాండ్​ సెమీస్ జరగనున్న నేపథ్యంలో బ్లాక్​ టికెట్ల విక్రేతలు రెచ్చిపోయారు. తాజాగా ముంబయికి చెందిన ఓ వ్యక్తి అధిక ధరకు టికెట్లు అమ్ముతూ పోలీసులకు దొరికొపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

World Cup 2023 Black Tickets
World Cup 2023 Black Tickets

World Cup 2023 Black Tickets : వరల్డ్​ కప్​ పేరిట రోజుకో మోసం బయటపడుతోంది. బ్లాక్​ టికెట్ల దందాతో విక్రేతలు ఎంతో మంది అభిమానులను బోల్తా కొట్టిస్తున్నారు. మ్యాచ్​కు ఉన్న క్రేజ్​ను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధర ఉన్న టిక్కెట్లను సైతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటీవలే భారత్​ -సౌతాఫ్రికా మ్యాచ్​ సమయంలో ఇదే పరిస్థితి నెలకొనగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్​తో భారత్​ మ్యాచ్ జరగనున్న​ నేపథ్యంలో బ్లాక్​ టికెట్​ విక్రేతలు రెచ్చిపోయారు. టికెట్లను హాట్​కేకుల్లా అమ్మడం మొదలెట్టారు. ఆఖరికి పోలీసుల చొరవతో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.

అసలేం జరిగిందంటే ?
India Vs Newzealand Semi Finals Tickets : వాంఖడే స్టేడియం వేదికగా భారత్​ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే టికెట్లు అందుబాటులోకి రాగా.. అవన్నీ త్వరగానే అమ్ముడైపోయాయి. దీంతో క్రికెట్​ లవర్స్​ టికెట్ల కోసం వేట మొదలెట్టారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి.. సుమారు రూ.2500 నుంచి రూ.4000 ఉన్న మ్యాచ్​ టిక్కెట్​ను రూ. 27,000 నుంచి రూ. 2,50,000 ధరకు అమ్మాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ​ మహారాష్ట్ర పోలీసులు మలాడ్‌కు చెందిన ఆకాశ్​ కొఠారి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్ కేసును నమోదు చేసి తదుపరి దర్యాప్తను ముమ్మరం చేశారు.

మరోవైపు వాంఖడే వేదికగా నవంబర్​ 15న తొలి సెమీస్​ జరగనుంది. ఇప్పటికే ఈ వేదికపై పలు జట్లు లీగ్​ మ్యాచుల్లో అత్యుత్తమ స్కోర్లను నమోదు చేయగా.. ఈ సారి కూడా అదే స్థాయిలో రికార్డులు నమోదవనున్నాయని క్రికెట్ లవర్స్​ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు కోచింగ్ సిబ్బంది సోమ‌వారం వాంఖ‌డే పిచ్‌ను పరిశీలించారు. ఇక ఇదే వేదికపై ఇటీవలే 'ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్'​లో స్థానం సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్​, అరవింద డి సిల్వా, డయానా ఎడల్జీలకు సన్మానం జరగనుంది.

'ప్లేయర్ ఆఫ్‌ ది అక్టోబర్‌ మంత్‌'గా రచిన్ రవీంద్ర - ఆ స్టార్​ పేసర్​ను దాటి!

వరల్డ్​ కప్ మ్యాచ్​లకు పోటెత్తిన అభిమానులు- రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా ప్రేక్షకులు హాజరు

World Cup 2023 Black Tickets : వరల్డ్​ కప్​ పేరిట రోజుకో మోసం బయటపడుతోంది. బ్లాక్​ టికెట్ల దందాతో విక్రేతలు ఎంతో మంది అభిమానులను బోల్తా కొట్టిస్తున్నారు. మ్యాచ్​కు ఉన్న క్రేజ్​ను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధర ఉన్న టిక్కెట్లను సైతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటీవలే భారత్​ -సౌతాఫ్రికా మ్యాచ్​ సమయంలో ఇదే పరిస్థితి నెలకొనగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్​తో భారత్​ మ్యాచ్ జరగనున్న​ నేపథ్యంలో బ్లాక్​ టికెట్​ విక్రేతలు రెచ్చిపోయారు. టికెట్లను హాట్​కేకుల్లా అమ్మడం మొదలెట్టారు. ఆఖరికి పోలీసుల చొరవతో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.

అసలేం జరిగిందంటే ?
India Vs Newzealand Semi Finals Tickets : వాంఖడే స్టేడియం వేదికగా భారత్​ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే టికెట్లు అందుబాటులోకి రాగా.. అవన్నీ త్వరగానే అమ్ముడైపోయాయి. దీంతో క్రికెట్​ లవర్స్​ టికెట్ల కోసం వేట మొదలెట్టారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి.. సుమారు రూ.2500 నుంచి రూ.4000 ఉన్న మ్యాచ్​ టిక్కెట్​ను రూ. 27,000 నుంచి రూ. 2,50,000 ధరకు అమ్మాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ​ మహారాష్ట్ర పోలీసులు మలాడ్‌కు చెందిన ఆకాశ్​ కొఠారి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్ కేసును నమోదు చేసి తదుపరి దర్యాప్తను ముమ్మరం చేశారు.

మరోవైపు వాంఖడే వేదికగా నవంబర్​ 15న తొలి సెమీస్​ జరగనుంది. ఇప్పటికే ఈ వేదికపై పలు జట్లు లీగ్​ మ్యాచుల్లో అత్యుత్తమ స్కోర్లను నమోదు చేయగా.. ఈ సారి కూడా అదే స్థాయిలో రికార్డులు నమోదవనున్నాయని క్రికెట్ లవర్స్​ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు కోచింగ్ సిబ్బంది సోమ‌వారం వాంఖ‌డే పిచ్‌ను పరిశీలించారు. ఇక ఇదే వేదికపై ఇటీవలే 'ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్'​లో స్థానం సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్​, అరవింద డి సిల్వా, డయానా ఎడల్జీలకు సన్మానం జరగనుంది.

'ప్లేయర్ ఆఫ్‌ ది అక్టోబర్‌ మంత్‌'గా రచిన్ రవీంద్ర - ఆ స్టార్​ పేసర్​ను దాటి!

వరల్డ్​ కప్ మ్యాచ్​లకు పోటెత్తిన అభిమానులు- రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా ప్రేక్షకులు హాజరు

Last Updated : Nov 14, 2023, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.