ETV Bharat / sports

రాణించిన లూయిస్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 144

author img

By

Published : Oct 26, 2021, 5:20 PM IST

Updated : Oct 26, 2021, 8:47 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్(WI vs SA t20) 143 పరుగులు చేసింది. ఓపెనర్​ లూయిస్ అర్ధసెంచరీతో రాణించాడు.

WI vs SA
వెస్టిండీస్, దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో.. దక్షిణాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వెస్టిండీస్‌(WI vs SA t20 match) మోస్తరు పరుగులకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌ ఎవిన్ లూయిస్‌ (56) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌ రెండు, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే తలో వికెట్ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్‌ నుంచి గేర్ మార్చిన ఎవిన్‌ లూయిస్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ లెండిల్‌ సిమ్మన్స్‌ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత లూయిస్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కి క్రీజు వీడాడు. కగిసో రబాడ వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్‌ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్‌ వాల్ష్‌ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్‌ (26) పరుగులు చేశాడు. డ్వేన్‌ బ్రావో (8), అకీల్ హోసీన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు.

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో.. దక్షిణాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వెస్టిండీస్‌(WI vs SA t20 match) మోస్తరు పరుగులకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌ ఎవిన్ లూయిస్‌ (56) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌ రెండు, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే తలో వికెట్ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్‌ నుంచి గేర్ మార్చిన ఎవిన్‌ లూయిస్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ లెండిల్‌ సిమ్మన్స్‌ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత లూయిస్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కి క్రీజు వీడాడు. కగిసో రబాడ వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్‌ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్‌ వాల్ష్‌ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్‌ (26) పరుగులు చేశాడు. డ్వేన్‌ బ్రావో (8), అకీల్ హోసీన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు.

ఇదీ చదవండి:

IPL New Team: ఐపీఎల్​లో కొత్త జట్లు.. ఫార్మాట్​లో మార్పులివే?

Last Updated : Oct 26, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.