ఇంగ్లాండ్ కుర్రాళ్ల జట్టు.. పటిష్టమైన పాక్ను మట్టికరిపించటంపై అభిమానులు, మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్ జట్టు వరుస వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) మండిపడ్డాడు. పాక్ ఆటతీరు చాలా సాధారణంగా ఉందన్నాడు. ఈ మేరకు టీం నిర్వహక బృందం, బోర్డు సభ్యులు, ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే.. పాకిస్థాన్ 3-0 తో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఖాయమన్నాడు. ఇలాంటి ప్రదర్శనతో భవిష్యత్తు తరాల ఆటగాళ్లలో స్ఫూర్తి నింపగలరా? అని ప్రశ్నించాడు.
వైఫల్యం విలువ..
ఈ పరాజయం విలువ రిక్టర్ స్కేల్పై 15గా ఉందని ఆ దేశానికే చెందిన మరో మాజీ క్రికెటర్ రమీజ్ రాజా(Ramiz Raja) తీవ్ర విమర్శలు చేశాడు. పాకిస్థాన్.. వరుస వైఫల్యాల కారణంగా అభిమానులు ఆటపై ఆసక్తి కనబరచటం లేదన్నాడు.
పాకిస్థాన్ సిరీస్కు ముందే.. ఇంగ్లాండ్ జట్టులో కరోనా కలవరం రేపింది. దీంతో కొత్త జట్టును ఈసీబీ ప్రకటించింది. 9 మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ సిరీస్కు స్టోక్స్ను కెప్టెన్గా నియమించింది. అయితే ఇంగ్లాండ్ కుర్రాళ్ల చేతిలో పటిష్టమైన పాక్ జట్టు ఓటమితో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంగ్లాండ్- పాకిస్థాన్ మూడు వన్డేల సిరీస్ను 2-0తో ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి : ఇంగ్లాండ్ కుర్రాళ్ల చేతిలో పాక్ ఓటమి