ETV Bharat / sports

టీమ్​ ఇండియా టెస్టు కెప్టెన్​గా అతడి పేరే ఖరారు!

author img

By

Published : Feb 8, 2022, 7:26 PM IST

India New Test Captain: భారత క్రికెట్​ జట్టు పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్​గా కూడా రోహిత్​ శర్మనే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Rohit Sharma likely to be appointed Indias Test captain
Rohit Sharma likely to be appointed Indias Test captain

India New Test Captain: టీమ్​ఇండియా వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న రోహిత్​ శర్మనే.. పూర్తిస్థాయి టెస్టు సారథి బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఇప్పటికే అతడి పేరు ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

2 టెస్టులు, 3 టీ-20ల సిరీస్​ కోసం శ్రీలంక.. భారత్​కు రానుంది. ఫిబ్రవరి 24న టీ-20లతో పర్యటన ప్రారంభం కానుంది. లంకతో టెస్టు సిరీస్​ కంటే ముందే.. ఛేతన్​ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్​ కమిటీ కెప్టెన్​గా రోహిత్​ పేరును ప్రకటించనుందని తెలుస్తోంది.

ఇటీవల సౌతాఫ్రికా చేతిలో 1-2 తేడాతో టీమ్​ఇండియా టెస్టు సిరీస్​ కోల్పోయిన అనంతరం.. సారథిగా వైదొలిగాడు విరాట్​ కోహ్లీ. అప్పటినుంచి ఈ పోస్ట్​ ఖాళీగా ఉంది. వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న రోహితే.. టెస్టు కెప్టెన్​ అవుతాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే.. మధ్యలో పంత్​, బుమ్రా, కేఎల్​ రాహుల్​ పేర్లు కూడా వినిపించాయి. కానీ.. సెలక్టర్లు రోహిత్​ వైపే మొగ్గినట్లు క్రికెట్​ పండితులు చెబుతున్నారు.

శ్రీలంకతో షెడ్యూల్​ ఇది..

ఫిబ్రవరి 24- తొలి టీ-20 (లఖ్​నవూ)

ఫిబ్రవరి 26- రెండో టీ-20 (ధర్మశాల)

ఫిబ్రవరి 27- మూడో టీ-20 (ధర్మశాల)

టెస్టు సిరీస్​ మార్చి 3న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 3-7 మధ్య తొలి టెస్టు పంజాబ్​లోని మొహలీ వేదికగా, రెండో టెస్టు మార్చి 12-16 మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే అవకాశాలున్నాయి.

మొహలీ టెస్టు మాజీ సారథి విరాట్​ కోహ్లీకి వందో టెస్టు. తొలుత తన వందో టెస్టును బెంగళూరులో నిర్వహించనున్నట్లు తెలియగా.. సిరీస్​లో మార్పుల అనంతరం మొహలీకి మారింది. ఈ షెడ్యూల్​పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇవీ చూడండి: ఇకపై ఇది 'టాటా ఐపీఎల్'.. వేలం తేదీలపై అధికారిక ప్రకటన

IPL 2022 Auction: ఐదు సార్లు ఛాంపియన్​- మళ్లీ వీళ్లను తీసుకుంటుందా?

India New Test Captain: టీమ్​ఇండియా వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న రోహిత్​ శర్మనే.. పూర్తిస్థాయి టెస్టు సారథి బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఇప్పటికే అతడి పేరు ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

2 టెస్టులు, 3 టీ-20ల సిరీస్​ కోసం శ్రీలంక.. భారత్​కు రానుంది. ఫిబ్రవరి 24న టీ-20లతో పర్యటన ప్రారంభం కానుంది. లంకతో టెస్టు సిరీస్​ కంటే ముందే.. ఛేతన్​ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్​ కమిటీ కెప్టెన్​గా రోహిత్​ పేరును ప్రకటించనుందని తెలుస్తోంది.

ఇటీవల సౌతాఫ్రికా చేతిలో 1-2 తేడాతో టీమ్​ఇండియా టెస్టు సిరీస్​ కోల్పోయిన అనంతరం.. సారథిగా వైదొలిగాడు విరాట్​ కోహ్లీ. అప్పటినుంచి ఈ పోస్ట్​ ఖాళీగా ఉంది. వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న రోహితే.. టెస్టు కెప్టెన్​ అవుతాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే.. మధ్యలో పంత్​, బుమ్రా, కేఎల్​ రాహుల్​ పేర్లు కూడా వినిపించాయి. కానీ.. సెలక్టర్లు రోహిత్​ వైపే మొగ్గినట్లు క్రికెట్​ పండితులు చెబుతున్నారు.

శ్రీలంకతో షెడ్యూల్​ ఇది..

ఫిబ్రవరి 24- తొలి టీ-20 (లఖ్​నవూ)

ఫిబ్రవరి 26- రెండో టీ-20 (ధర్మశాల)

ఫిబ్రవరి 27- మూడో టీ-20 (ధర్మశాల)

టెస్టు సిరీస్​ మార్చి 3న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 3-7 మధ్య తొలి టెస్టు పంజాబ్​లోని మొహలీ వేదికగా, రెండో టెస్టు మార్చి 12-16 మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే అవకాశాలున్నాయి.

మొహలీ టెస్టు మాజీ సారథి విరాట్​ కోహ్లీకి వందో టెస్టు. తొలుత తన వందో టెస్టును బెంగళూరులో నిర్వహించనున్నట్లు తెలియగా.. సిరీస్​లో మార్పుల అనంతరం మొహలీకి మారింది. ఈ షెడ్యూల్​పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇవీ చూడండి: ఇకపై ఇది 'టాటా ఐపీఎల్'.. వేలం తేదీలపై అధికారిక ప్రకటన

IPL 2022 Auction: ఐదు సార్లు ఛాంపియన్​- మళ్లీ వీళ్లను తీసుకుంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.