టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) క్రికెట్కు వీడ్కోలు చెప్పినా.. అభిమానుల్లో అతడికి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. మహీకి సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ కావల్సిందే. తాజా ఫొటో కూడా ఆ కోవలోకే వస్తుంది.
ధోనీ తన చిన్ననాటి మిత్రులతో కలిసి ఓ దాబాలో భోజనం చేస్తున్న ఓ చిత్రాన్ని ఇన్స్టాలో షేర్ చేశాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ధోనీ ఇటీవల తన భార్యకు గిఫ్ట్గా ఇచ్చిన కారు ఇదేనని అభిమానులు వాదిస్తున్నారు. దాని ధర కోట్లలో ఉంది.
మహీ స్టార్ క్రికెటర్ అయినప్పటికీ తన స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు. వారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. అందుకే అతన్ని చాలా మంది మిత్రులు ఎక్కువగా ఇష్టపడతారు.
ఇదీ చదవండి: ధోనీ కంటే ముందొచ్చారు.. రిటైర్మెంట్ వద్దంటున్నారు!