ETV Bharat / sports

'టీమ్ఇండియాను తక్కువ అంచనా వేయలేం' - టీమ్ఇండియాపై విలియమ్సన్ స్పందన

ఏకైక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినంత మాత్రాన టీమ్ఇండియా బలహీనమైన జట్టు కాదని అభిప్రాయపడ్డాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఏకైక మ్యాచ్​ అనేది ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. దాని ద్వారానే కోహ్లీసేనను అంచనా వేయలేమని తెలిపాడు. వారెంత బలమైన జట్టో తమకు తెలుసని అన్నాడు.

kane williamson, team india
కేన్ విలియమ్సన్, టీమ్ఇండియా
author img

By

Published : Jun 28, 2021, 10:47 PM IST

ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​పై కివీస్​ కెప్టెన్ కేన్ విలియమ్సన్​ స్పందించాడు. ఏకైక మ్యాచ్​ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఆ ఒక్క మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా గురించి పూర్తిగా అంచనా వేయలేమని పేర్కొన్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు జెంటిల్​మన్​ గేమ్​కు అంబాసిడర్ల వంటి వారని కొనియాడాడు. ఆ దేశ అభిమానులు క్రికెట్ పట్ల గొప్ప ప్రేమను చూపిస్తారని అభిప్రాయపడ్డాడు.

ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్​లో కోహ్లీసేనపై కివీస్​ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 139 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్ సెంచరీతో తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు కేన్​.

"ప్రతిష్ఠాత్మక ఏకైక ఫైనల్​ మ్యాచ్​ అనేది ఆసక్తికరంగా ఉంది. కానీ, ఈ ఒక్క మ్యాచ్​ ద్వారా మొత్తం టీమ్​ఇండియా ఏంటనేది చెప్పలేం. కోహ్లీసేన చాలా బలమైన జట్టని మాకు తెలుసు. ఇంత గొప్ప జట్టుపై ఫైనల్లో గెలిచినందుకు గర్వంగా ఉంది. మేము వారిపై గెలిచినంత మాత్రాన వారిది బలహీనమైన జట్టని కాదు. టీమ్ఇండియా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మంచి పేస్ ఎటాక్​తో పాటు నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక బ్యాటింగ్​లో వారికి తిరుగు లేదు.'

-కేన్ విలియమ్సన్, కివీస్ కెప్టెన్.

మ్యాచ్​ చివరిరోజు గురించి మాట్లాడుతూ "వర్షం కారణంగా చాలా ఆట తుడిచిపెట్టుకుపోవడం వల్ల ఎక్కువ డ్రాకు అవకాశముంటుందని అనుకున్నాం. కానీ, ఆరో రోజు ఆటలో కోహ్లీ, పుజారా వికెట్లు తొందరగా దక్కాయి. దీంతో ఆటపై స్పష్టత వచ్చింది. ఇక ఫలితం రావడానికి ఎంతో సమయం పట్టదనిపించింది" అని కేన్ తెలిపాడు.

ఇక నిర్ణయాత్మక మ్యాచ్​లో ఆల్​రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జేమీసన్​పై​ ప్రశంసలు కురిపించాడు కేన్. "అతడొక తెలివైన ఆటగాడు. కొత్త ఆటగాడు అయినప్పటికీ అంచనాలను అందుకున్నాడు. బంతితో పాటు బ్యాట్​తోనూ రాణించడం మాకు కలిసొచ్చింది. ప్రధాన వికెట్లను తీసుకున్నాడు" అని కివీస్ కెప్టెన్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: Michael Holding: 'ఐపీఎల్​​ అసలు క్రికెటే కాదు'

ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​పై కివీస్​ కెప్టెన్ కేన్ విలియమ్సన్​ స్పందించాడు. ఏకైక మ్యాచ్​ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఆ ఒక్క మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా గురించి పూర్తిగా అంచనా వేయలేమని పేర్కొన్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు జెంటిల్​మన్​ గేమ్​కు అంబాసిడర్ల వంటి వారని కొనియాడాడు. ఆ దేశ అభిమానులు క్రికెట్ పట్ల గొప్ప ప్రేమను చూపిస్తారని అభిప్రాయపడ్డాడు.

ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్​లో కోహ్లీసేనపై కివీస్​ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 139 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్ సెంచరీతో తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు కేన్​.

"ప్రతిష్ఠాత్మక ఏకైక ఫైనల్​ మ్యాచ్​ అనేది ఆసక్తికరంగా ఉంది. కానీ, ఈ ఒక్క మ్యాచ్​ ద్వారా మొత్తం టీమ్​ఇండియా ఏంటనేది చెప్పలేం. కోహ్లీసేన చాలా బలమైన జట్టని మాకు తెలుసు. ఇంత గొప్ప జట్టుపై ఫైనల్లో గెలిచినందుకు గర్వంగా ఉంది. మేము వారిపై గెలిచినంత మాత్రాన వారిది బలహీనమైన జట్టని కాదు. టీమ్ఇండియా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మంచి పేస్ ఎటాక్​తో పాటు నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక బ్యాటింగ్​లో వారికి తిరుగు లేదు.'

-కేన్ విలియమ్సన్, కివీస్ కెప్టెన్.

మ్యాచ్​ చివరిరోజు గురించి మాట్లాడుతూ "వర్షం కారణంగా చాలా ఆట తుడిచిపెట్టుకుపోవడం వల్ల ఎక్కువ డ్రాకు అవకాశముంటుందని అనుకున్నాం. కానీ, ఆరో రోజు ఆటలో కోహ్లీ, పుజారా వికెట్లు తొందరగా దక్కాయి. దీంతో ఆటపై స్పష్టత వచ్చింది. ఇక ఫలితం రావడానికి ఎంతో సమయం పట్టదనిపించింది" అని కేన్ తెలిపాడు.

ఇక నిర్ణయాత్మక మ్యాచ్​లో ఆల్​రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జేమీసన్​పై​ ప్రశంసలు కురిపించాడు కేన్. "అతడొక తెలివైన ఆటగాడు. కొత్త ఆటగాడు అయినప్పటికీ అంచనాలను అందుకున్నాడు. బంతితో పాటు బ్యాట్​తోనూ రాణించడం మాకు కలిసొచ్చింది. ప్రధాన వికెట్లను తీసుకున్నాడు" అని కివీస్ కెప్టెన్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: Michael Holding: 'ఐపీఎల్​​ అసలు క్రికెటే కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.