ETV Bharat / sports

మరీ ఇలా కూడా రనౌట్​ అవుతారా?

క్రికెట్‌లో రనౌట్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్​గా ఉమెన్స్​ టీ20 ప్రపంచకప్​ 2023 సెమీస్​లో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్​ కౌర్​ రనౌట్​ మర్చిపోవకముందే.. ఇప్పుడు మరో లేజీ రనౌట్​ నమోదై చర్చనీయాంశమైంది. ఆ వివరాలు...

author img

By

Published : Feb 27, 2023, 4:18 PM IST

bracewell runout
న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ రనౌట్​

క్రికెట్‌లో అలసత్వం, నిర్లక్ష్యం అసలు పనికిరాదు. ఎంతో చురుగ్గా, తెలివిగా ఆడాలి. లేదంటే మైదానం వీడాల్సిందే. ముఖ్యంగా వికెట్ల మధ్య రన్స్​ చేసే సమయంలో కొంచెం అలసత్వం ప్రదర్శించినా వికెట్‌ సమర్పించుకోవాల్సిందే. అయితే ఈ ఆటలో అటు ప్లేయర్లను, ఇటు అభిమానులను ఎక్కువగా బాధకలిగించే విషయం రనౌట్​. ఎందుకంటే ఏ ప్లేయరైనా రనౌట్​ అయితే.. ఎదుర్కొనే విమర్శలు, ట్రోల్స్​ మాములుగా ఉండవు. సోషల్​మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తారు.

రీసెంట్​గా ఉమెన్స్​ టీ20 ప్రపంచకప్​ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్​లో టీమ్​ఇండియా సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆమె రనౌట్​ వల్ల.. గెలవాల్సిన మ్యాచ్‌.. చేజారిపోయినట్టైంది! దీనిపై నెటిజన్లు, మాజీలు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికీ నానా హంగామా చేస్తున్నారు. నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అయితే ఈ రనౌట్‌ను ఇంకా క్రికెట్‌ అభిమానులు మర్చిపోవకముందే.. మరో రనౌట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇంగ్లాండ్​-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్​లో ఓ లేజీ రనౌట్‌ చోటు చేసుకుంది. 158.2వ ఓవర్లో ఇంగ్లాండ్​ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఆసీస్​ ప్లేయర్​ బ్లండెల్‌ షాట్‌ కొట్టి.. బ్రేస్‌వెల్‌తో కలిసి రెండు పరుగులు చేశాడు. అయితే, మూడో రన్ చేసే అవకాశం ఉండటంతో మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తాడు బ్రేస్​వెల్​. కానీ ఇక్కడ అతడు అలసత్వం ప్రదర్శిస్తూ.. నిర్లక్ష్యంగా పరిగెడుతూ కనిపించాడు. క్రీజ్‌లో బ్యాట్‌ పెట్టకుండా తన చేత్తోనే పట్టుకుని క్రీజులోకి వెళ్లేందుకు ట్రై చేశాడు. దీన్ని గమనించిన ఇంగ్లాండ్​ వికెట్‌ కీపర్‌ బంతిని అందుకుని సూపర్​స్పీడ్​తో వికెట్లను తిరగేశాడు. అంపైర్లు రీప్లేలో పరిశీలించి.. బ్రేస్‌వెల్​కు దిమ్మతిరిగేలా రనౌట్​ను ప్రకటించారు. దీంతో కివీస్‌ జట్టు మరో వికెట్‌ కోల్పోయింది. ఇక ఇది చూసిన క్రికెట్​ అభిమానులు అతడిని విమర్శిస్తూ ఫుల్ ట్రోల్ చేశారు. ఇంత బద్దకమా, ఇంత ఈజీగా వికెట్‌ సమర్పించుకోవడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.

కాగా, బ్రేస్‌వెల్‌ తొలి టెస్టులోనూ 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి మళ్లీ ఫెయిల్​ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో కివీస్​ 209 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్​ 8 వికెట్లు కోల్పోయి 435 రన్స్​ చేసి డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్​లో కివీస్​ 483 పరుగులు చేసి ఫాలో ఆన్​ ఆడి.. ప్రత్యర్థి జట్టుకు 258 రన్స్​ లక్యాన్ని నిర్దేశించింది. అలా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్​ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది.

ఇదీ చూడండి: శార్దూల్​ పెళ్లిలో శ్రేయస్​ అయ్యర్​ హంగామా!

క్రికెట్‌లో అలసత్వం, నిర్లక్ష్యం అసలు పనికిరాదు. ఎంతో చురుగ్గా, తెలివిగా ఆడాలి. లేదంటే మైదానం వీడాల్సిందే. ముఖ్యంగా వికెట్ల మధ్య రన్స్​ చేసే సమయంలో కొంచెం అలసత్వం ప్రదర్శించినా వికెట్‌ సమర్పించుకోవాల్సిందే. అయితే ఈ ఆటలో అటు ప్లేయర్లను, ఇటు అభిమానులను ఎక్కువగా బాధకలిగించే విషయం రనౌట్​. ఎందుకంటే ఏ ప్లేయరైనా రనౌట్​ అయితే.. ఎదుర్కొనే విమర్శలు, ట్రోల్స్​ మాములుగా ఉండవు. సోషల్​మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తారు.

రీసెంట్​గా ఉమెన్స్​ టీ20 ప్రపంచకప్​ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్​లో టీమ్​ఇండియా సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆమె రనౌట్​ వల్ల.. గెలవాల్సిన మ్యాచ్‌.. చేజారిపోయినట్టైంది! దీనిపై నెటిజన్లు, మాజీలు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికీ నానా హంగామా చేస్తున్నారు. నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అయితే ఈ రనౌట్‌ను ఇంకా క్రికెట్‌ అభిమానులు మర్చిపోవకముందే.. మరో రనౌట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇంగ్లాండ్​-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్​లో ఓ లేజీ రనౌట్‌ చోటు చేసుకుంది. 158.2వ ఓవర్లో ఇంగ్లాండ్​ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఆసీస్​ ప్లేయర్​ బ్లండెల్‌ షాట్‌ కొట్టి.. బ్రేస్‌వెల్‌తో కలిసి రెండు పరుగులు చేశాడు. అయితే, మూడో రన్ చేసే అవకాశం ఉండటంతో మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తాడు బ్రేస్​వెల్​. కానీ ఇక్కడ అతడు అలసత్వం ప్రదర్శిస్తూ.. నిర్లక్ష్యంగా పరిగెడుతూ కనిపించాడు. క్రీజ్‌లో బ్యాట్‌ పెట్టకుండా తన చేత్తోనే పట్టుకుని క్రీజులోకి వెళ్లేందుకు ట్రై చేశాడు. దీన్ని గమనించిన ఇంగ్లాండ్​ వికెట్‌ కీపర్‌ బంతిని అందుకుని సూపర్​స్పీడ్​తో వికెట్లను తిరగేశాడు. అంపైర్లు రీప్లేలో పరిశీలించి.. బ్రేస్‌వెల్​కు దిమ్మతిరిగేలా రనౌట్​ను ప్రకటించారు. దీంతో కివీస్‌ జట్టు మరో వికెట్‌ కోల్పోయింది. ఇక ఇది చూసిన క్రికెట్​ అభిమానులు అతడిని విమర్శిస్తూ ఫుల్ ట్రోల్ చేశారు. ఇంత బద్దకమా, ఇంత ఈజీగా వికెట్‌ సమర్పించుకోవడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.

కాగా, బ్రేస్‌వెల్‌ తొలి టెస్టులోనూ 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి మళ్లీ ఫెయిల్​ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో కివీస్​ 209 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్​ 8 వికెట్లు కోల్పోయి 435 రన్స్​ చేసి డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్​లో కివీస్​ 483 పరుగులు చేసి ఫాలో ఆన్​ ఆడి.. ప్రత్యర్థి జట్టుకు 258 రన్స్​ లక్యాన్ని నిర్దేశించింది. అలా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్​ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది.

ఇదీ చూడండి: శార్దూల్​ పెళ్లిలో శ్రేయస్​ అయ్యర్​ హంగామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.