ETV Bharat / sports

IPL 2023: అదిరిపోయే అరంగేట్రం.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ప్లేయర్​గా...

author img

By

Published : Apr 1, 2023, 10:09 PM IST

Updated : Apr 1, 2023, 10:24 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్​లో లఖ్​నవూ జెయింట్స్​ ప్లేయర్​ కైల్​ మేయర్స్ ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్​లోనే సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Kyle mayors
IPL 2023: అదిరిపోయే అరంగేట్రం.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ప్లేయర్​గా...

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్​ జరుగుతోంది. దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో లఖ్​నవూ జెయింట్స్​కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్​ హార్డ్​ హిట్టర్​ కైల్​ మేయర్స్​ అదరగొట్టేశాడు. తన డెబ్యూ ఐపీఎల్​లోనే మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 38 బంతుల్లో రెండు ఫోర్లు, ఏడు సిక్స్​లతో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ క్రమంలోనే ఓ సూపర్​ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్​లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అలా తమ తొలి మ్యాచ్​లోనే ఎక్కువ స్కోరు చేసిన ప్లేయర్స్ లిస్ట్​లో నాలుగో స్థానంలో నిలిచాడు.

అంతకుముందు 2008లో కోల్​కతా నైట్​ రైడర్స్​-రాయల్ ఛాలెంజర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(కేకేఆర్​)​ 158 అజేయ పరుగులు చేశాడు. అలా డెబ్యూ మ్యాచ్​లోనే అత్యధిక స్కోరు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం 2008లో చెన్నై సూపర్ కింగ్స్​-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో చెలరేగిపోయిన మైక్‌ హస్సీ రెండో ప్లేయర్​గా నిలిచాడు. ఆ తర్వాత అదే సీజన్​లో 2008లో పంజాబ్​ కింగ్స్​-డెక్కన్​ చార్జర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో షాన్‌ మార్ష్‌ 84* పరుగులతో రాణించాడు. అలా ఈ ముగ్గురు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. తాజాగా కైల్‌ మేయర్స్‌ తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే 73 పరుగులు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.

కాగా, ఈ మ్యాచ్​లో టాస్ ఓడి ఫస్ట్​ బ్యాటింగ్ చేసిన లఖ్​నవూ సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిపోయిన ఓపెనర్ కైల్ మేయర్స్.. సెంచరీ బాదుతాడని ఆశిస్తే.. అతడిని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. దీంతో దిల్లీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోగా.. లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ ఫ్యాన్స్​కు నిరాశ ఎదురైంది. ఇక మేయర్స్ ఔట్ అవ్వగానే స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవారు విఫలమయ్యారు. ఒక్క నికోలస్ పూరన్(36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రం కాసేపు క్రీజులో నిలబడగలిగాడు. చివర్లో ఆయుష్ బదోని(18; 7 బంతుల్లో 2x6, 1x4) పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోరు 193 పరుగుల వద్ద ముగిసింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అక్సర్, కుల్దీప్​ చెరో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: కోల్​కతాకు వరుణుడి షాక్.. D/L పద్ధతిలో పంజాబ్​ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్​ జరుగుతోంది. దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో లఖ్​నవూ జెయింట్స్​కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్​ హార్డ్​ హిట్టర్​ కైల్​ మేయర్స్​ అదరగొట్టేశాడు. తన డెబ్యూ ఐపీఎల్​లోనే మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 38 బంతుల్లో రెండు ఫోర్లు, ఏడు సిక్స్​లతో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ క్రమంలోనే ఓ సూపర్​ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్​లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అలా తమ తొలి మ్యాచ్​లోనే ఎక్కువ స్కోరు చేసిన ప్లేయర్స్ లిస్ట్​లో నాలుగో స్థానంలో నిలిచాడు.

అంతకుముందు 2008లో కోల్​కతా నైట్​ రైడర్స్​-రాయల్ ఛాలెంజర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(కేకేఆర్​)​ 158 అజేయ పరుగులు చేశాడు. అలా డెబ్యూ మ్యాచ్​లోనే అత్యధిక స్కోరు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం 2008లో చెన్నై సూపర్ కింగ్స్​-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో చెలరేగిపోయిన మైక్‌ హస్సీ రెండో ప్లేయర్​గా నిలిచాడు. ఆ తర్వాత అదే సీజన్​లో 2008లో పంజాబ్​ కింగ్స్​-డెక్కన్​ చార్జర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో షాన్‌ మార్ష్‌ 84* పరుగులతో రాణించాడు. అలా ఈ ముగ్గురు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. తాజాగా కైల్‌ మేయర్స్‌ తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే 73 పరుగులు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.

కాగా, ఈ మ్యాచ్​లో టాస్ ఓడి ఫస్ట్​ బ్యాటింగ్ చేసిన లఖ్​నవూ సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిపోయిన ఓపెనర్ కైల్ మేయర్స్.. సెంచరీ బాదుతాడని ఆశిస్తే.. అతడిని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. దీంతో దిల్లీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోగా.. లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ ఫ్యాన్స్​కు నిరాశ ఎదురైంది. ఇక మేయర్స్ ఔట్ అవ్వగానే స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవారు విఫలమయ్యారు. ఒక్క నికోలస్ పూరన్(36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రం కాసేపు క్రీజులో నిలబడగలిగాడు. చివర్లో ఆయుష్ బదోని(18; 7 బంతుల్లో 2x6, 1x4) పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోరు 193 పరుగుల వద్ద ముగిసింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అక్సర్, కుల్దీప్​ చెరో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: కోల్​కతాకు వరుణుడి షాక్.. D/L పద్ధతిలో పంజాబ్​ విజయం

Last Updated : Apr 1, 2023, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.