పంజాబ్ కింగ్స్ జట్టులోని విదేశీ బౌలర్ల పట్ల తానెంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు టీమ్ డైరెక్టర్ అనిల్ కుంబ్లే. ప్రపంచస్థాయి బౌలర్లతో తమ టీమ్ మరింత బలంగా మారిందని అభిప్రాయపడ్డాడు.
"రాజస్థాన్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను నిలువరించడం మాకు అవసరం. గతేడాది విజయానికి చేరువగా వచ్చాం. ఈ ఏడాది కచ్చితంగా విజయంతో లీగ్ను ప్రారంభించాలనుకుంటున్నాం. మా జట్టులో అత్యుత్తమ విదేశీ బౌలర్లు అయిన జే రిచర్డ్సన్, మెరిడిత్, క్రిస్ జోర్డాన్ వంటి వారున్నారు. ఈ బౌలర్ల చేరికతో జట్టు బలంగా కనిపిస్తుంది. దీని పట్ల సంతోషంగా ఉన్నాం."
- అనిల్ కుంబ్లే, పంజాబ్ కింగ్స్ డైరెక్టర్
"కొన్ని వారాలుగా మాకు మంచి ప్రాక్టీస్ లభించింది. ఇది గతేడాది ఐపీఎల్కు ఈ సీజన్ పొడిగింపులా అనిపిస్తుంది. లీగ్ ఆరంభానికి ముందు చాలా ప్రయోగాలు చేశాం. ప్రాక్టీస్ మ్యాచ్లు కఠినంగా సాగాయి. మానసిక కోచ్ ఉండటం జట్టుకు అదనపు బలమ"ని కుంబ్లే తెలిపాడు.
గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. లోగోతో పాటు పేరును మార్చుకున్న ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.
ఇదీ చదవండి: మనీష్ వల్లే సన్రైజర్స్ ఓడిపోయింది!: సెహ్వాగ్