ETV Bharat / sports

IPL 2021: ప్రేక్షకులకు అనుమతి.. కానీ!

author img

By

Published : May 31, 2021, 4:18 PM IST

Updated : May 31, 2021, 4:27 PM IST

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ రెండోదశ(IPL 2021) కోసం స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించే విషయమై అక్కడి ప్రభుత్వంతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో అభిమానులను అనుమతించడం సహా మ్యాచ్​ చూడ్డానికి వచ్చేవారంతా కచ్చితంగా వ్యాక్సిన్​ వేయించుకోవాలనే నిబంధన పెట్టనున్నట్లు తెలుస్తోంది.

IPL 2021, IPL IN UAE, BCCI, vaccination is must
IPL 2021: టీకా తీసుకున్న వారికే స్టేడియాల్లోకి అనుమతి!

కరోనా కారణంగా ఐపీఎల్​(IPL 2021)లో వాయిదా పడిన మిగిలిన మ్యాచ్​లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఇటీవలే బీసీసీఐ ఆమోదం తెలిపింది. యూఏఈ(IPL in UAE)లోని షార్జా, దుబాయ్​, అబుదాబి స్టేడియాల్లో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. దీని కోసం ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ మ్యాచ్​లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఇప్పుడు చర్చ నడుస్తోంది. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించేందుకు యూఏఈ ప్రభుత్వంతో బీసీసీఐ(BCCI) చర్చించనుందని తెలుస్తోంది.

ఓ ప్రముఖ క్రీడాఛానల్​ వివరాల ప్రకారం.. భారత్​ వేదికగా ఐపీఎల్​ 2021లో జరిగిన మ్యాచ్​లకు ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ, యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ రెండో దశ కోసం కనీసం 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో అభిమానులను అనుమతించాలని యోచిస్తుంది. అయితే వ్యాక్సిన్​ వేయించుకున్న వారికే టికెట్లు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా ఐపీఎల్​(IPL 2021)లో వాయిదా పడిన మిగిలిన మ్యాచ్​లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఇటీవలే బీసీసీఐ ఆమోదం తెలిపింది. యూఏఈ(IPL in UAE)లోని షార్జా, దుబాయ్​, అబుదాబి స్టేడియాల్లో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. దీని కోసం ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ మ్యాచ్​లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఇప్పుడు చర్చ నడుస్తోంది. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించేందుకు యూఏఈ ప్రభుత్వంతో బీసీసీఐ(BCCI) చర్చించనుందని తెలుస్తోంది.

ఓ ప్రముఖ క్రీడాఛానల్​ వివరాల ప్రకారం.. భారత్​ వేదికగా ఐపీఎల్​ 2021లో జరిగిన మ్యాచ్​లకు ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ, యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ రెండో దశ కోసం కనీసం 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో అభిమానులను అనుమతించాలని యోచిస్తుంది. అయితే వ్యాక్సిన్​ వేయించుకున్న వారికే టికెట్లు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ipl 2021: యూఏఈ వేదికగా ఐపీఎల్​ రెండో దశ

Last Updated : May 31, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.