ETV Bharat / sports

హైదరాబాద్​లో ఐపీఎల్​ మ్యాచ్​లపై బీసీసీఐకి ఆఫర్

author img

By

Published : Apr 4, 2021, 5:03 PM IST

అవకాశమిస్తే హైదరాబాద్​లో ఐపీఎల్​ మ్యాచ్​ల్ని సురక్షిత వాతావరణంలో జరుపుతామని హెచ్​సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ట్వీట్ చేశారు. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

Azharuddin offers to host IPL games in Hyderabad
హైదరాబాద్​లో ఐపీఎల్​ మ్యాచ్​లపై బీసీసీఐకి ఆఫర్

ఐపీఎల్​ మ్యాచ్​ల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. ముంబయిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి జరగాల్సిన మ్యాచ్​లపై సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజహర్.. బీసీసీఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

  • In these difficult times there is all the more reasons for us to stand by each other. Hyderabad Cricket Association would like to offer its facilities to @BCCI to ensure that IPL2021 is conducted in safe and secure venues.

    — Mohammed Azharuddin (@azharflicks) April 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇలాంటి కష్టసమాయాల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి. సురక్షిత, సౌకర్యవంతంగా ఐపీఎల్​ మ్యాచ్​ల నిర్వహిస్తామని హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్ హామీ ఇస్తోంది" అని అజహరుద్దీన్ ట్వీట్ చేశారు.

శుక్రవారం, శనివారం.. ముంబయిలోని వాంఖడే మైదాన సిబ్బందిలో 10 మందికి, ఆరుగురు ఈవెంట్​ మేనేజర్లకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో పాటు మహారాష్ట్రలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ముంబయిలో షెడ్యూల్​ ప్రకారం 10 మ్యాచ్​లు జరుగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆటగాళ్లు బయో బబుల్​లో ఉన్నారని, అందువల్ల మ్యాచ్​లు ఆటంకం లేకుండగా జరుగుతాయని​ బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. మరి ఏమవుతుందో చూడాలి?

ఐపీఎల్​ మ్యాచ్​ల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. ముంబయిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి జరగాల్సిన మ్యాచ్​లపై సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజహర్.. బీసీసీఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

  • In these difficult times there is all the more reasons for us to stand by each other. Hyderabad Cricket Association would like to offer its facilities to @BCCI to ensure that IPL2021 is conducted in safe and secure venues.

    — Mohammed Azharuddin (@azharflicks) April 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇలాంటి కష్టసమాయాల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి. సురక్షిత, సౌకర్యవంతంగా ఐపీఎల్​ మ్యాచ్​ల నిర్వహిస్తామని హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్ హామీ ఇస్తోంది" అని అజహరుద్దీన్ ట్వీట్ చేశారు.

శుక్రవారం, శనివారం.. ముంబయిలోని వాంఖడే మైదాన సిబ్బందిలో 10 మందికి, ఆరుగురు ఈవెంట్​ మేనేజర్లకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో పాటు మహారాష్ట్రలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ముంబయిలో షెడ్యూల్​ ప్రకారం 10 మ్యాచ్​లు జరుగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆటగాళ్లు బయో బబుల్​లో ఉన్నారని, అందువల్ల మ్యాచ్​లు ఆటంకం లేకుండగా జరుగుతాయని​ బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. మరి ఏమవుతుందో చూడాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.