ETV Bharat / sports

'సన్​రైజర్స్​ ఆటగాళ్లకు బోర్డింగ్​ పాసులు సిద్ధమయ్యాయి'

author img

By

Published : Oct 6, 2021, 1:58 PM IST

Updated : Oct 6, 2021, 7:13 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్(RCB vs SRH 2021)​ మధ్య నేడు(అక్టోబర్ 6) మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​ జట్టుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra News). హైదరాబాద్​ ఆటగాళ్లకు బోర్డింగ్​ పాసులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించాడు.

akash chopra
ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం (అక్టోబర్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్ల(SRH vs RCB head to head) మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​ జట్టుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra News Latest). ఇరు జట్ల మధ్య మ్యాచ్​ ఏకపక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

"ఓ జట్టు టాప్​-2లో స్థానం కోసం ప్రయత్నిస్తుండగా మరో జట్టు ఇక ఆడలేం ఇంటికి వెళ్లాలి అన్నట్లు ఎదురుచూస్తోంది. హైదరాబాద్​ జట్టుకు వీసాలు, బోర్డింగ్​ పాసులు సిద్ధంగా ఉన్నాయి. ఎస్​ఆర్​హెచ్​ ఆటగాళ్లు శారీరకంగానే టోర్నీలో ఉన్నారు. మానసికంగా ఇంటికి వెళ్లి చాలా సమయం అవుతోంది."

-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.

జేసన్ రాయ్, విలియమ్సన్​ బ్యాటింగ్​లో విఫలమైతే సన్​రైజర్స్​ తక్కువ లక్ష్యానికే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆకాశ్​ చోప్రా(Aakash Chopra news) అన్నాడు. అయితే హైదరాబాద్​ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదని.. అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నాడు.

ప్రస్తుతం సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టులో మిడిలార్డర్​ సమస్య ఉంది. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివరకూ 12 మ్యాచ్​లాడిన సన్​రైజర్స్​ జట్టు కేవలం రెండు మ్యాచ్​ల్లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరోవైపు బెంగళూరు మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి:MS Dhoni IPL: చెన్నైలోనే ధోనీ వీడ్కోలు మ్యాచ్‌!

ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం (అక్టోబర్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్ల(SRH vs RCB head to head) మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​ జట్టుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra News Latest). ఇరు జట్ల మధ్య మ్యాచ్​ ఏకపక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

"ఓ జట్టు టాప్​-2లో స్థానం కోసం ప్రయత్నిస్తుండగా మరో జట్టు ఇక ఆడలేం ఇంటికి వెళ్లాలి అన్నట్లు ఎదురుచూస్తోంది. హైదరాబాద్​ జట్టుకు వీసాలు, బోర్డింగ్​ పాసులు సిద్ధంగా ఉన్నాయి. ఎస్​ఆర్​హెచ్​ ఆటగాళ్లు శారీరకంగానే టోర్నీలో ఉన్నారు. మానసికంగా ఇంటికి వెళ్లి చాలా సమయం అవుతోంది."

-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.

జేసన్ రాయ్, విలియమ్సన్​ బ్యాటింగ్​లో విఫలమైతే సన్​రైజర్స్​ తక్కువ లక్ష్యానికే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆకాశ్​ చోప్రా(Aakash Chopra news) అన్నాడు. అయితే హైదరాబాద్​ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదని.. అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నాడు.

ప్రస్తుతం సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టులో మిడిలార్డర్​ సమస్య ఉంది. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివరకూ 12 మ్యాచ్​లాడిన సన్​రైజర్స్​ జట్టు కేవలం రెండు మ్యాచ్​ల్లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరోవైపు బెంగళూరు మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి:MS Dhoni IPL: చెన్నైలోనే ధోనీ వీడ్కోలు మ్యాచ్‌!

Last Updated : Oct 6, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.