ETV Bharat / sports

కోహ్లీ-పడిక్కల్ ధమాకా.. రాజస్థాన్​పై బెంగళూరు గెలుపు

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన . కోహ్లీ, దేవ్​దత్ మెరుపులు మెరిపించారు.

author img

By

Published : Oct 3, 2020, 7:28 PM IST

Updated : Oct 3, 2020, 7:42 PM IST

Royal Challengers Bangalore beat rajasthan royals by 8 wickets
కోహ్లీ-పడిక్కల్ ధమాకా.. రాజస్థాన్​పై బెంగళూరు గెలుపు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అబుదాబిలో అద్భుతం చేసింది. రాజస్థాన్​ రాయల్స్​పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. కోహ్లీ(72*), దేవ్​దత్(63) అర్ధ శతకాలతో మెరిశారు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన.

155 పరుగుల ఛేదనలో బెంగళూరుకు ఆరంభం అదిరింది. 2.3 ఓవర్లలోనే 25 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ ఫించ్.. శ్రేయస్ గోపాల్ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. దేవ్​దత్ పడిక్కల్​తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్​కు 99 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ విజయాన్ని ఖరారు చేశారు.

ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్​(12*)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు కోహ్లీ. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, గోపాల్.. చెరో వికెట్​ పడగొట్టాడు.

Royal Challengers Bangalore beat rajasthan royals
బెంగళూరు-రాజస్థాన్ మ్యాచ్​లోని దృశ్యం

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ జట్టు. ఈ జట్టులో లోమ్రర్(47) మాత్రమే ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాట్స్​మెన్​లో బట్లర్(22), స్మిత్ (5), శాంసన్ 4, ఉతప్ప 17, రియాన్ పరాగ్ 16, తెవాతియా 24*, ఆర్చర్ 16* పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 3, ఉదానా 2, సైనీ 1 వికెట్ పడగొట్టారు.

Royal Challengers Bangalore beat rajasthan royals
బెంగళూరు-రాజస్థాన్ మ్యాచ్​లోని దృశ్యం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అబుదాబిలో అద్భుతం చేసింది. రాజస్థాన్​ రాయల్స్​పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. కోహ్లీ(72*), దేవ్​దత్(63) అర్ధ శతకాలతో మెరిశారు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన.

155 పరుగుల ఛేదనలో బెంగళూరుకు ఆరంభం అదిరింది. 2.3 ఓవర్లలోనే 25 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ ఫించ్.. శ్రేయస్ గోపాల్ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. దేవ్​దత్ పడిక్కల్​తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్​కు 99 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ విజయాన్ని ఖరారు చేశారు.

ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్​(12*)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు కోహ్లీ. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, గోపాల్.. చెరో వికెట్​ పడగొట్టాడు.

Royal Challengers Bangalore beat rajasthan royals
బెంగళూరు-రాజస్థాన్ మ్యాచ్​లోని దృశ్యం

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ జట్టు. ఈ జట్టులో లోమ్రర్(47) మాత్రమే ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాట్స్​మెన్​లో బట్లర్(22), స్మిత్ (5), శాంసన్ 4, ఉతప్ప 17, రియాన్ పరాగ్ 16, తెవాతియా 24*, ఆర్చర్ 16* పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 3, ఉదానా 2, సైనీ 1 వికెట్ పడగొట్టారు.

Royal Challengers Bangalore beat rajasthan royals
బెంగళూరు-రాజస్థాన్ మ్యాచ్​లోని దృశ్యం
Last Updated : Oct 3, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.