ఈసారి ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలస్తుందని కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మన్ ఇయాన్ మోర్గాన్ జోస్యం చెప్పాడు. ఆదివారం దిల్లీతో మ్యాచ్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచులో అతడు క్రీజులోకి వచ్చేసరికి.. 43 బంతుల్లో 113 పరుగులు చేయాలి కోల్కతా. వచ్చిరాగానే 18 బంతుల్లో ఫోర్, ఐదు సిక్సర్లతో మోత మోగించాడు. దీంతో ఇతడిని టాప్ ఆర్డలో దించుంటే మరింత విజృంభించేవాడని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాను ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగడంపైనా స్పందించాడు మోర్గాన్. తాను ఆలస్యంగా క్రీజులోకి వచ్చాననుకోవట్లేదని అన్నాడు.

"నేను క్రీజులోకి ఆలస్యంగా వచ్చానని భావించట్లేదు. మా బ్యాటింగ్ లైనప్లో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అయినా ప్రపంచస్థాయి ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ ఉండగా మిగతా ఆటగాళ్లు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగడం కష్టం. దిల్లీ జట్టు విషయానికొస్తే బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఈ సీజన్లో వారే ట్రోఫీని అందుకునే అవకాశాలు ఉన్నాయి"
-మోర్గాన్, కోల్కతా బ్యాట్స్మన్
"నరైన్ ఓ ప్రత్యేక ఆటగాడు. ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతోనే ఉంటాడు. గతంలో చాలాసార్లు జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పడు అద్భుతంగా ఆడి ఆటనే మార్చేశాడు. గతసీజన్లలో అతడి గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయలేము" అని మోర్గాన్ అన్నాడు.
షార్జాలో జరిగిన మ్యాచ్లో కోల్కతాపై దిల్లీ 18 పరుగులు తేడాతో గెలిచింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా 8 వికెట్లు కోల్పోయి 210కే పరిమితమైంది. నితీశ్ రాణా(58) అర్థశతకం చేయగా.. ఆఖర్లో ఇయాన్ మోర్గాన్(44), రాహుల్ త్రిపాఠి(36) మెరుపులు వృథా అయింది. బౌలర్లు నోర్ట్జ్(3/33), హర్షల్ పటేల్(2/34) వల్ల దిల్లీ గెలిచింది.
అంతకుముందు దిల్లీ బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ (88), పృథ్వీ షా(66), పంత్(38) కీలక పాత్ర పోషించారు. మిగతా బౌలర్లు కగిసొ రబడా, అమిత్ మిశ్రా, స్టొయినిస్ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి అదరగొట్టిన దిల్లీ.. మోర్గాన్ పోరాటం వృథా