ETV Bharat / sports

గతేడాది కంటే పెరిగిన ఐపీఎల్​ వ్యూయర్​ షిప్

author img

By

Published : Oct 31, 2020, 12:25 PM IST

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్​ యూఏఈ వేదికగా జరుగుతోంది. వైరస్ విజృంభణ వల్ల ఖాళీ స్టేడియాల్లో జరుగుతోన్న ఈ మ్యాచ్​లను టీవీల్లో చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. దీంతో రేటింగ్స్​ కూడా పెరుగుతున్నాయి. తాజాగా బార్క్ విడుదల చేసిన డాటా ప్రకారం గతేడాది కంటే 28 శాతం వ్యూయర్ షిప్​ను పెంచుకుంది ఐపీఎల్.

IPL 13 viewership up by 28% compared to last year
గతేడాది కంటే పెరిగిన ఐపీఎల్​ వ్యూయర్​ షిప్

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అసలు జరుగుతుందో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ భారత్​లో వైరస్​ విజృంభణ ఎక్కువగా ఉన్న దృష్ట్యా యూఏఈలో లీగ్ జరిపేందుకు మొగ్గుచూపింది పాలకమండలి. ప్రస్తుతం అక్కడ జరుగుతోన్న ఐపీఎల్​ ఖాళీ మైదానాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్​లను చూడటానికి ప్రేక్షకులు టీవీలు, మొబైల్స్​ను ఎంచుకున్నారు. ఈ కారణంగా ఐపీఎల్ వ్యూయర్​షిప్ పెద్దమొత్తంలో పెరిగింది. గతేడాదితో పోలిస్తే 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ విషయాన్ని బ్రాడ్​కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది.

బార్క్ డాటా ప్రకారం ఇప్పటివరకు 21 ఛానెల్స్​లో ప్రసారమైన 41 మ్యాచ్​లకు 7 వందల కోట్ల నిమిషాల వ్యూస్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే వీక్షణల్లో 28 శాతం పెరుగుదల కనిపించింది. ఐపీఎల్ 12వ సీజన్​ 24 ఛానెళ్లలో ప్రసారం కాగా 44 మ్యాచ్​లకు 550 కోట్ల నిమిషాల వీక్షణలు వచ్చాయి.

వ్యూయర్​షిప్​లో పెరుగుదలకు కరోనానే కారణమని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. "ఎవరూ స్టేడియాల్లో మ్యాచ్​లు చూడట్లేదు. అందరూ టీవీల్లో చూస్తున్నారు. అందువల్ల కచ్చితంగా వీక్షణలు పెరుగుతాయి" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అసలు జరుగుతుందో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ భారత్​లో వైరస్​ విజృంభణ ఎక్కువగా ఉన్న దృష్ట్యా యూఏఈలో లీగ్ జరిపేందుకు మొగ్గుచూపింది పాలకమండలి. ప్రస్తుతం అక్కడ జరుగుతోన్న ఐపీఎల్​ ఖాళీ మైదానాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్​లను చూడటానికి ప్రేక్షకులు టీవీలు, మొబైల్స్​ను ఎంచుకున్నారు. ఈ కారణంగా ఐపీఎల్ వ్యూయర్​షిప్ పెద్దమొత్తంలో పెరిగింది. గతేడాదితో పోలిస్తే 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ విషయాన్ని బ్రాడ్​కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది.

బార్క్ డాటా ప్రకారం ఇప్పటివరకు 21 ఛానెల్స్​లో ప్రసారమైన 41 మ్యాచ్​లకు 7 వందల కోట్ల నిమిషాల వ్యూస్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే వీక్షణల్లో 28 శాతం పెరుగుదల కనిపించింది. ఐపీఎల్ 12వ సీజన్​ 24 ఛానెళ్లలో ప్రసారం కాగా 44 మ్యాచ్​లకు 550 కోట్ల నిమిషాల వీక్షణలు వచ్చాయి.

వ్యూయర్​షిప్​లో పెరుగుదలకు కరోనానే కారణమని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. "ఎవరూ స్టేడియాల్లో మ్యాచ్​లు చూడట్లేదు. అందరూ టీవీల్లో చూస్తున్నారు. అందువల్ల కచ్చితంగా వీక్షణలు పెరుగుతాయి" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.