శ్రీలంక పర్యటన షెడ్యూల్ను ప్రకటించింది మ్యాచ్ల ప్రసారదారు సోనీ. జులై 13 నుంచి 25 వరకు జరగనున్నట్లు తెలిపింది. ఇరు జట్లు మూడు వన్డేలు(జులై 13,16,18), మూడు టీ20లు(21,23,25)వ తేదీల్లో ఆడనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ మ్యాచ్లు నిర్వహించే వేదికలను ప్రకటించలేదు.
చాలా ఏళ్ల తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమీ సహా 20 మందితో కూడిన జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్(జున్ 18-22), ఇంగ్లాండ్ సిరీస్(ఆగస్టు4-సెప్టెంబరు 14) ఆడనుంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్.. వీరిలో ఒకరు సారథిగా వ్యవహరించే అవకాశముంది.
ఇదీ చూడండి IND VS SL: 'భారత జట్టు గెలిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు'