శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. క్వారంటైన్ నిమిత్తం ముంబయిలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.
శిఖర్ ధావన్ నేతృత్వంలోని 20 మందితో కూడిన భారత జట్టు తప్పనిసరి క్వారంటైన్ కోసం ముంబయిలో కలుసుకుంది. లంక పర్యటనకు వెళ్లే ముందు వీరంతా 14 రోజుల కఠిన నిర్బంధంలో ఉండనున్నారు. జులై 13న తొలి వన్డే ప్రారంభం కానుంది.
- — BCCI (@BCCI) June 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— BCCI (@BCCI) June 15, 2021
">— BCCI (@BCCI) June 15, 2021
ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బీసీసీఐ.. కెప్టెన్ ధావన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్తో పాటు ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ లంక పర్యటనకు భారత జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అధికారికంగా వెల్లడించాడు.
భారత జట్టు..
ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాన్ కిషన్, శాంసన్, చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.
నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్.
ఇదీ చదవండి: శునకంతో రవిశాస్త్రి క్యాచ్ల ప్రాక్టీస్.. వీడియో వైరల్