ETV Bharat / sports

ఆసీస్​తో మూడో టెస్టు.. గెలిస్తే ధోనీ సరసన రహానె - మరో రికార్డు చేరువలో రహానె

కరోనా నిబంధనల ఉల్లంఘనల వివాదం, ఉమేష్‌కు గాయం, జట్టు కూర్పు వంటి ప్రతికూలతల మధ్య టీమ్​ఇండియా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. తొలి టెస్టు ఘోరపరాజయం అనంతరం రెండో టెస్టులో భారత జట్టును గొప్పగా నడిపించిన సారథి రహానె.. ఈ టెస్టులోనూ గెలిచి తన ముద్ర వేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఉమేష్‌ స్థానంలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలన్న విషయంలో భారత జట్టు మల్లగుల్లాలు పడుతోంది.

Ind vs Aus Third test
ఆసీస్​తో మూడో టెస్టు గెలిస్తే ధోని సరసన రహానె
author img

By

Published : Jan 6, 2021, 5:35 AM IST

Updated : Jan 6, 2021, 6:19 AM IST

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఘన విజయం అనంతరం సిడ్నీ వేదికగా గురువారం నుంచి జరగనున్న మూడో టెస్టుకు టీమ్​ఇండియా సిద్ధమవుతోంది. ఈ టెస్టులోనూ.. గెలిచి సిరీస్‌లో ముందడుగు వేయాలని రహానె సేన పట్టుదలగా ఉంది. కండరాల గాయంతో సిరీస్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే అంశంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మల్లగుల్లాలు పడుతోంది. శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీలలో.. ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయంపై మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సిడ్నీలో పరిస్థితులు మబ్బు పట్టి ఉండి పిచ్‌పై తేమ ఉంటే శార్దూల్‌ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పిచ్‌ ప్లాట్‌గా ఉంటే మంచి వేగంతో బంతులు వేయగల సైనీ వైపు జట్టు మొగ్గు చూపే అవకాశం ఉంది. బంతిని రివర్స్ స్వింగ్‌ చేయగల సామర్థ్యం సైనీకి ఉంది. రెండేళ్ల క్రితం తొలి టెస్టు ఆడిన శార్దూల్ ‌ఠాకూర్‌... ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే గాయపడి మైదానాన్ని వీడాడు. ఠాకూర్‌కు తుదిజట్టులో చోటు దక్కితే అతడికి అనధికారికంగా ఇదే తొలి టెస్టు కానుంది.

సిడ్నీలో ఒకే విజయం..

రోహిత్‌శర్మ చేరికతో టీమ్​ఇండియా బ్యాటింగ్‌ విభాగం బలపడింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్‌శర్మ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్‌ను స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కానీ సిడ్నీ మైదానంలో రికార్డు భారత్‌ను కలవరపెడుతోంది. ఇందులో 12 టెస్టుల్లో భారత్‌ ఒక్క విజయం మాత్రమే సాధించింది.

1978లో బిషన్‌సింగ్‌ బేడీ నాయకత్వంలో భారత జట్టు ఇన్నింగ్స్‌ రెండు పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. ఆ తర్వాత తొమ్మిది టెస్టుల్లో భారత్‌ తలపడినా మరో గెలుపు అందుకోలేకపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై మిగిలిన టెస్టులను డ్రా గా ముగించింది. 42 ఏళ్ల సిడ్నీ గెలుపు నిరీక్షణకు తెరదించాలని రహానె పట్టుదలగా ఉన్నాడు. తన కెప్టెన్సీలో ఓటమెరుగని రహానె ఈ అరుదైన ఘనత సాధిస్తాడో లేదో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ధోనీ సరసన..

సిడ్నీ టెస్టులో రహానె జట్టును గెలిపిస్తే మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. తొలి నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ సరసన నిలుస్తాడు. ఇప్పటివరకు మూడు టెస్టులకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రహానె అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించాడు. బ్యాట్స్‌మన్‌గానూ రహానె మరోరికార్డుపై కన్నేశాడు. మరో 203 పరుగులు చేస్తే కంగారూల గడ్డపై 1000 పరుగులు పూర్తిచేసిన అయిదో భారత బ్యాట్స్‌మెన్‌గా రహానె రికార్డు సృష్టిస్తాడు.

ఇదీ చదవండి:స్కూల్​ లెవల్​​ క్రికెట్​ ఆడుతున్నారు: అక్తర్​

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఘన విజయం అనంతరం సిడ్నీ వేదికగా గురువారం నుంచి జరగనున్న మూడో టెస్టుకు టీమ్​ఇండియా సిద్ధమవుతోంది. ఈ టెస్టులోనూ.. గెలిచి సిరీస్‌లో ముందడుగు వేయాలని రహానె సేన పట్టుదలగా ఉంది. కండరాల గాయంతో సిరీస్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే అంశంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మల్లగుల్లాలు పడుతోంది. శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీలలో.. ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయంపై మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సిడ్నీలో పరిస్థితులు మబ్బు పట్టి ఉండి పిచ్‌పై తేమ ఉంటే శార్దూల్‌ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పిచ్‌ ప్లాట్‌గా ఉంటే మంచి వేగంతో బంతులు వేయగల సైనీ వైపు జట్టు మొగ్గు చూపే అవకాశం ఉంది. బంతిని రివర్స్ స్వింగ్‌ చేయగల సామర్థ్యం సైనీకి ఉంది. రెండేళ్ల క్రితం తొలి టెస్టు ఆడిన శార్దూల్ ‌ఠాకూర్‌... ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే గాయపడి మైదానాన్ని వీడాడు. ఠాకూర్‌కు తుదిజట్టులో చోటు దక్కితే అతడికి అనధికారికంగా ఇదే తొలి టెస్టు కానుంది.

సిడ్నీలో ఒకే విజయం..

రోహిత్‌శర్మ చేరికతో టీమ్​ఇండియా బ్యాటింగ్‌ విభాగం బలపడింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్‌శర్మ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్‌ను స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కానీ సిడ్నీ మైదానంలో రికార్డు భారత్‌ను కలవరపెడుతోంది. ఇందులో 12 టెస్టుల్లో భారత్‌ ఒక్క విజయం మాత్రమే సాధించింది.

1978లో బిషన్‌సింగ్‌ బేడీ నాయకత్వంలో భారత జట్టు ఇన్నింగ్స్‌ రెండు పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. ఆ తర్వాత తొమ్మిది టెస్టుల్లో భారత్‌ తలపడినా మరో గెలుపు అందుకోలేకపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై మిగిలిన టెస్టులను డ్రా గా ముగించింది. 42 ఏళ్ల సిడ్నీ గెలుపు నిరీక్షణకు తెరదించాలని రహానె పట్టుదలగా ఉన్నాడు. తన కెప్టెన్సీలో ఓటమెరుగని రహానె ఈ అరుదైన ఘనత సాధిస్తాడో లేదో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ధోనీ సరసన..

సిడ్నీ టెస్టులో రహానె జట్టును గెలిపిస్తే మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. తొలి నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ సరసన నిలుస్తాడు. ఇప్పటివరకు మూడు టెస్టులకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రహానె అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించాడు. బ్యాట్స్‌మన్‌గానూ రహానె మరోరికార్డుపై కన్నేశాడు. మరో 203 పరుగులు చేస్తే కంగారూల గడ్డపై 1000 పరుగులు పూర్తిచేసిన అయిదో భారత బ్యాట్స్‌మెన్‌గా రహానె రికార్డు సృష్టిస్తాడు.

ఇదీ చదవండి:స్కూల్​ లెవల్​​ క్రికెట్​ ఆడుతున్నారు: అక్తర్​

Last Updated : Jan 6, 2021, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.