ETV Bharat / sports

వెస్టిండీస్​తో సిరీస్​.. ఆరేళ్ల తర్వాత ఆ క్రికెటర్​ రీఎంట్రీ!

author img

By

Published : Jan 26, 2022, 1:12 PM IST

IND VS WI RishiDhawan: స్వదేశంలో వెస్టిండీస్​తో జరగనున్న సిరీస్​లో రిషి ధావన్​, షారుక్​ ఖాన్​లను ఎంపిక చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు క్రికెట్​ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రిషి దాదాపుగా ఆరేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినట్టవుతుంది.

rishi dhawan reentry
rishi dhawan reentry

IND VS WI RishiDhawan: దక్షిణాఫ్రికా పర్యటనలో ఓటమి చెందిన టీమ్​ఇండియా.. స్వదేశంలో వెస్టిండీస్​తో పరిమిత ఓవర్ల సిరీస్​కు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్​కు గాయం నుంచి కోలుకున్న రోహిత్​శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ క్రికెట్​లో అదరగొట్టిన ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆల్​రౌండర్​ రిషి ధావన్​, షారుక్​ ఖాన్​ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి

458 పరుగులు.. 17 వికెట్లు

విజయ్​హజారే ట్రోఫీలో హిమ్​చల్​ ప్రదేశ్​ కెప్టెన్​ రిషి ధావన్​ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు సహా 17 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి.

రిషి.. 2016లో ధోనీ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్​ అరంగేట్రం చేశాడు. మూడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. తొలి మ్యాచ్​ను ఆస్ట్రేలియాపై ఆడగా.. అదే ఏడాది చివరిగా జింబాబ్వేపై ఆడాడు. ఆ తర్వాత అతడికి అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు దేశవాళీ టోర్నీలో అతడు బాగా రాణించిన నేపథ్యంలో అతడికి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ అతడు ఎంపిక అయితే సుదీర్ఘకాలం ఆరేళ్ల తర్వాత​ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినట్టవుతుంది.

ఆఖరి బంతికి సిక్స్​

తమిళనాడు ఆటగాడు షారుక్​ ఖాన్​ కూడా దేశవాళీ టీ20 సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ, విజయ్​ హజారే ట్రోఫీలో బాగా రాణించాడు. సయ్యద్​ ట్రోఫీ ఫైనల్​లో ఆఖరి బంతికి సిక్స్​ బాది తమిళనాడు జ్టటుకు విజయాన్ని అందించాడు.

ఈ ప్రదర్శనలతో రిషి, షారుక్​ సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. దీంతో వీరు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హార్దిక్​ పాండ్యా ఈ సిరీస్​కు కూడా అందుబాటులో ఉండడని క్రికెట్​ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

కోహ్లీ, దాదా గొడవ.. అలా చేయాలని కపిల్​దేవ్​ సూచన

IND VS WI RishiDhawan: దక్షిణాఫ్రికా పర్యటనలో ఓటమి చెందిన టీమ్​ఇండియా.. స్వదేశంలో వెస్టిండీస్​తో పరిమిత ఓవర్ల సిరీస్​కు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్​కు గాయం నుంచి కోలుకున్న రోహిత్​శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ క్రికెట్​లో అదరగొట్టిన ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆల్​రౌండర్​ రిషి ధావన్​, షారుక్​ ఖాన్​ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి

458 పరుగులు.. 17 వికెట్లు

విజయ్​హజారే ట్రోఫీలో హిమ్​చల్​ ప్రదేశ్​ కెప్టెన్​ రిషి ధావన్​ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు సహా 17 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి.

రిషి.. 2016లో ధోనీ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్​ అరంగేట్రం చేశాడు. మూడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. తొలి మ్యాచ్​ను ఆస్ట్రేలియాపై ఆడగా.. అదే ఏడాది చివరిగా జింబాబ్వేపై ఆడాడు. ఆ తర్వాత అతడికి అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు దేశవాళీ టోర్నీలో అతడు బాగా రాణించిన నేపథ్యంలో అతడికి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ అతడు ఎంపిక అయితే సుదీర్ఘకాలం ఆరేళ్ల తర్వాత​ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినట్టవుతుంది.

ఆఖరి బంతికి సిక్స్​

తమిళనాడు ఆటగాడు షారుక్​ ఖాన్​ కూడా దేశవాళీ టీ20 సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ, విజయ్​ హజారే ట్రోఫీలో బాగా రాణించాడు. సయ్యద్​ ట్రోఫీ ఫైనల్​లో ఆఖరి బంతికి సిక్స్​ బాది తమిళనాడు జ్టటుకు విజయాన్ని అందించాడు.

ఈ ప్రదర్శనలతో రిషి, షారుక్​ సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. దీంతో వీరు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హార్దిక్​ పాండ్యా ఈ సిరీస్​కు కూడా అందుబాటులో ఉండడని క్రికెట్​ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

కోహ్లీ, దాదా గొడవ.. అలా చేయాలని కపిల్​దేవ్​ సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.