ETV Bharat / sports

విరాట్ బర్త్​డే ఎఫెక్ట్, బీసీసీఐపై పోలీస్ కంప్లైంట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 1:57 PM IST

Updated : Nov 2, 2023, 2:12 PM IST

IND vs SA Tickets Booking Issue : నవంబర్​ 5న భారత్​, సౌతాఫ్రికాతో తలపడనుంది. అదే రోజు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్​డే కావడం వల్ల.. మ్యాచ్​పై విపరీతమైన హైప్​ క్రియేట్ అయ్యింది. కానీ, ఈ మ్యాచ్​ను స్టేడియంలో చూద్దామనుకున్న ఫ్యాన్స్​కు మాత్రం నిరాశ తప్పేలా లేదు. తాజాగా మ్యాచ్​ టికెట్లు బుక్ అవ్వడం లేదంటూ.. ఓ క్రికెట్ అభిమాని కోల్​కతాలో సంబంధిత బుకింగ్ ప్లాట్​ఫామ్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ind vs sa tickets booking issue
ind vs sa tickets booking issue

IND vs SA Tickets Booking Issue : 2023 ప్రపంచకప్​లో భాగంగా నవంబర్ 5న కోల్​కతా ఈడెన్ గార్డెన్స్​ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. అదే రోజు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్​డే కావడం విశేషం. అయితే మామూలుగానే మెగాటోర్నీలో భారత్ మ్యాచ్​ అనగానే.. ఫుల్​ క్రేజ్ ఉంటుంది. అందులోనూ విరాట్ పుట్టినరోజున స్టేడియంలో తన బ్యాటింగ్ చూసే ఛాన్స్ వస్తుందంటే ఆ అవకాశాన్ని ఫ్యాన్స్ అస్సలు మిస్​ అవ్వరు.

ఈ నేపథ్యంలోనే భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్​ టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే నవంబర్ 5న మ్యాచ్​ టికెట్లు బుక్ చేస్తుంటే.. కన్ఫార్మ్ అవ్వడం లేదంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విస్తుపోయిన ఓ క్రికెట్ ఫ్యాన్ కోల్​కతా, మైదాన్ పోలీస్ స్టేషన్​లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ సహా బుకింగ్ ప్లాట్​ఫామ్​లైన బుక్​మైషో(BOOK MY SHOW), క్యాబ్ (CAB) సక్రమంగా టికెట్ల అమ్మకాలు జరపడం లేదని.. వాటిని అధిక లాభాల కోసం బ్లాక్​లో విక్రయిస్తున్నారని ఆ అభిమాని ఆరోపించాడు.

ఇక ఈ విషయాన్ని పరిశీలించిన మైదాన్​ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 2న బుక్​మైషో, క్యాబ్ సంస్థ నిర్వాహకులను విచారణకు పిలిచినట్లు సమాచారం. కానీ, అటు బుక్​మైషో, ఇటు బీసీసీఐ ఈ విషయంపై ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.

IND Vs SA Match Black Tickets : అయితే ఇటీవల ఇదే మ్యాచ్​కు సంబంధించిన టికెట్లను బ్లాక్​లో విక్రయిస్తున్న వ్యక్తిని.. కోల్​కతా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నగరానికి చెందిన అంకిత్​ అగర్వాల్ అనే వ్యక్తి రూ.2,500 మ్యాచ్​ టికెట్లను రూ.11 వేలకు విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న కోల్​కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. అతడి వద్ద నుంచి 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే.. ఆన్​లైన్​లో టికెట్లు బుక్ అవ్వకపోవడంపై సగటు క్రికెట్ ఫ్యాన్స్ పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

Match Day feels 😎👌#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/YfCdD0Gbcc

— BCCI (@BCCI) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టాస్ గెలుచుకుని బౌలింగ్​ ఎంచుకున్న శ్రీలంక

ఇంకొక్క అడుగు- గెలిస్తే అఫీషియల్​గా సెమీస్‌కు

IND vs SA Tickets Booking Issue : 2023 ప్రపంచకప్​లో భాగంగా నవంబర్ 5న కోల్​కతా ఈడెన్ గార్డెన్స్​ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. అదే రోజు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్​డే కావడం విశేషం. అయితే మామూలుగానే మెగాటోర్నీలో భారత్ మ్యాచ్​ అనగానే.. ఫుల్​ క్రేజ్ ఉంటుంది. అందులోనూ విరాట్ పుట్టినరోజున స్టేడియంలో తన బ్యాటింగ్ చూసే ఛాన్స్ వస్తుందంటే ఆ అవకాశాన్ని ఫ్యాన్స్ అస్సలు మిస్​ అవ్వరు.

ఈ నేపథ్యంలోనే భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్​ టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే నవంబర్ 5న మ్యాచ్​ టికెట్లు బుక్ చేస్తుంటే.. కన్ఫార్మ్ అవ్వడం లేదంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విస్తుపోయిన ఓ క్రికెట్ ఫ్యాన్ కోల్​కతా, మైదాన్ పోలీస్ స్టేషన్​లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ సహా బుకింగ్ ప్లాట్​ఫామ్​లైన బుక్​మైషో(BOOK MY SHOW), క్యాబ్ (CAB) సక్రమంగా టికెట్ల అమ్మకాలు జరపడం లేదని.. వాటిని అధిక లాభాల కోసం బ్లాక్​లో విక్రయిస్తున్నారని ఆ అభిమాని ఆరోపించాడు.

ఇక ఈ విషయాన్ని పరిశీలించిన మైదాన్​ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 2న బుక్​మైషో, క్యాబ్ సంస్థ నిర్వాహకులను విచారణకు పిలిచినట్లు సమాచారం. కానీ, అటు బుక్​మైషో, ఇటు బీసీసీఐ ఈ విషయంపై ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.

IND Vs SA Match Black Tickets : అయితే ఇటీవల ఇదే మ్యాచ్​కు సంబంధించిన టికెట్లను బ్లాక్​లో విక్రయిస్తున్న వ్యక్తిని.. కోల్​కతా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నగరానికి చెందిన అంకిత్​ అగర్వాల్ అనే వ్యక్తి రూ.2,500 మ్యాచ్​ టికెట్లను రూ.11 వేలకు విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న కోల్​కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. అతడి వద్ద నుంచి 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే.. ఆన్​లైన్​లో టికెట్లు బుక్ అవ్వకపోవడంపై సగటు క్రికెట్ ఫ్యాన్స్ పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

టాస్ గెలుచుకుని బౌలింగ్​ ఎంచుకున్న శ్రీలంక

ఇంకొక్క అడుగు- గెలిస్తే అఫీషియల్​గా సెమీస్‌కు

Last Updated : Nov 2, 2023, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.