ETV Bharat / sports

IND vs NZ 2nd Test: కరోనా ఎఫెక్ట్​- పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు

author img

By

Published : Nov 30, 2021, 8:54 AM IST

IND vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌ని నిర్వహిస్తామని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్ వెల్లడించింది.

india
టీమ్​ఇండియా

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టెస్టుకు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎమ్‌సీఏ)(Mumbai Cricket Association News) వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌ని నిర్వహిస్తామని ప్రకటించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిసెంబరు 3 నుంచి టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌(India vs NZ 2nd Test Venue) జరగనుంది.

'కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇస్తాం. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే స్టేడియం ఓ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తాం' అని ఎమ్‌సీఏ సెక్రెటరీ సంజయ్‌ నాయక్‌ తెలిపారు. ఈ స్టేడియంలో చివరి సారిగా 2016 డిసెంబరులో భారత్, ఇంగ్లాండ్‌ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. వాంఖడే స్టేడియంలో ఒకేసారి 33 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

ఇదీ చదవండి:

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టెస్టుకు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎమ్‌సీఏ)(Mumbai Cricket Association News) వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌ని నిర్వహిస్తామని ప్రకటించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిసెంబరు 3 నుంచి టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌(India vs NZ 2nd Test Venue) జరగనుంది.

'కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇస్తాం. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే స్టేడియం ఓ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తాం' అని ఎమ్‌సీఏ సెక్రెటరీ సంజయ్‌ నాయక్‌ తెలిపారు. ఈ స్టేడియంలో చివరి సారిగా 2016 డిసెంబరులో భారత్, ఇంగ్లాండ్‌ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. వాంఖడే స్టేడియంలో ఒకేసారి 33 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

ఇదీ చదవండి:

IND vs NZ Test: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

IND vs NZ Test: డ్రాగా ముగిసిన భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.