భారత్, ఇంగ్లాండ్ మహిళల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. కెప్టెన్ హెదర్ నైట్ (95; 175 బంతుల్లో 9×4) సత్తా చాటడం వల్ల ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. టామీ బీమౌంట్ (66; 144 బంతుల్లో 6×4) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. నటాలీ సీవర్ (42), విన్ఫీల్డ్ హిల్ (35) రాణించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఓ దశలో 230/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ భారత్ ఆఖర్లో పుంజుకుంది. 21 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చింది. స్పిన్నర్లు స్నేహా రాణా (3/77), దీప్తి శర్మ (2/50) ప్రత్యర్థిని దెబ్బతీశారు. సోఫియా డంక్లే (12), కేథరిన్ బ్రంట్ (7) క్రీజులో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లాండ్ మహిళల తొలి ఇన్నింగ్స్: 269/6 (నైట్ 95, బీమౌంట్ 66, సీవర్ 42, విన్ఫీల్డ్ హిల్ 35; స్నేహ 3/77, దీప్తి 2/50)
ఐదుగురు అరంగేట్రం
ఈ మ్యాచ్తో ఐదుగురు టీమ్ఇండియా క్రికెటర్లు టెస్టు అరంగేట్రం చేశారు. యువ విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma), ఆల్రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma), పేసర్ పూజా వస్త్రాకర్, వికెట్ కీపర్ తానియా భాటియా ఇందులో ఉన్నారు. అలాగే తొలి టెస్టు ఆడుతోన్న స్నేహా రానాకు ఐదేళ్ల తర్వాత తుదిజట్టులో చోటు దక్కింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సోఫియా డ్రంక్లీ కూడా ఈ మ్యాచ్తో టెస్టు అరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మహిళా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న తొలి నల్లజాతి మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.