ETV Bharat / sports

కెప్టెన్సీకి బాబర్​ అజామ్​ గుడ్​ బై- ఇంగ్లాండ్​తో మ్యాచ్​ తర్వాతే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 12:36 PM IST

Updated : Nov 11, 2023, 2:31 PM IST

Pak Vs Eng World Cup 2023 Babar Azam : భారత్​ వేదికగా జరుగుతున్న 2023 వరల్డ్​ కప్​లో పాకిస్థాన్​ జట్టు ప్రదర్శన.. బాబర్​ అజామ్​ కెప్టెన్సీకి ఎసరు పెట్టింది. టీమ్​ పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్​.. శనివారం ఇంగ్లాండ్​తో మ్యాత్​ తర్వాత తన కెప్టెన్సీకి గుడ్​బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Pak Vs Eng World Cup 2023 Babar Azam
Pak Vs Eng World Cup 2023 Babar Azam

Pak Vs Eng World Cup 2023 Babar Azam : 2023 వరల్డ్ కప్​ రసవత్తరంగా మారింది. ఇప్పటికే టీమ్ఇండియా ఎదురులేకుండా దూసుకెళ్తుంటే.. దాయాది దేశం పాకిస్థాన్​ ఆఖరి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. శనివారం (నవంబర్ 11) పాక్​ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. ఇంగ్లాండ్​ నాకౌట్​ దశకు దూరమైంది. పాకిస్థాన్​కు మాత్రం ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, పాక్​ సెమీస్​కు చేరాలంటే ఈ మ్యాచ్​లో పాక్​ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితే పాక్​ కెప్టెన్ బాబర్​ అజామ్​కు లైఫ్​ అండ్​ డెత్​ సమస్యగా పరిణమించింది.

కెప్టెన్సీకి బాబర్​ గుడ్​బై!
2023 ప్రపంచ కప్‌లో అంచనాలు అందుకోలేకపోవడం, పేలవమైన ప్రదర్శన వల్ల బాబర్ అజామ్​ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ నుంచి దిగిపోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ తర్వాత వైట్ బాల్ జట్టు కెప్టెన్సీకి దూరం కానున్నట్లు సమాచారం. పాక్​కు తిరిగి వెళ్లిన తర్వాత పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్​ రజాతో కలిసిన తర్వాత.. బాబర్​ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని తెలుస్తోంది. వారి నుంచి వచ్చే సూచనల మేరకు కెప్టెన్​గా ఉండాలా వద్దా అనే నిర్ణయం ఉండొచ్చని సమాచారం. అయితే ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాబర్ సారథిగా కొనసాగే అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ వరల్డ్​ కప్​లో ఇప్పటివరకు జరిగిన పాక్​ ప్లేయర్స్​ అన్ని మ్యాచ్​లో నిరాశపర్చారు. బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించుకున్నా.. బౌలర్ల నుంచి మాత్రం సహకారం లభించలేదు. దీంతో టీమ్​ భారీ స్కోర్లు నమోదు చేసినా.. విజయ తీరాలకు చేరలేదు. అయితే, జట్టు విఫలమవడం వల్ల.. ఆ మొత్తం భారం సారథి బాబర్ అజామ్​పైనే పడుతోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తర్వాత ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో శనివారం పాక్​ ఇంగ్లాండ్​తో తలపడుతోంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే పాకిస్థాన్​కు 10 పాయింట్లు వస్తాయి. అయితే ఇప్పటికే కివీస్​ జట్టు 10 పాయింట్లతోపాటు మెరుగైన రన్ రేట్‌తో సెమీస్​కు అర్హత సాధించింది. ఇప్పుడు న్యూజిలాండ్​ను వెనక్కు నెట్టి.. పాకిస్థాన్ సెమీస్​ బెర్త్​ సాధించాలంటే.. ఇంగ్లాండ్​పై 287 పరుగుల తేడాతో ఓడించాలి. ఈ నేపథ్యంలో పరిస్థితుల్లో పాకిస్థాన్​కు ఈ సవాల్​గా మారింది.

'అలా చేయడం కన్నా కొత్త షాట్లు నేర్చుకోవడమే నయం'

వరల్డ్​ కప్​లో కొత్త మెరుపులు - సీనియర్స్​ ఉన్నా యంగ్​ ప్లేయర్ల హవా!

Pak Vs Eng World Cup 2023 Babar Azam : 2023 వరల్డ్ కప్​ రసవత్తరంగా మారింది. ఇప్పటికే టీమ్ఇండియా ఎదురులేకుండా దూసుకెళ్తుంటే.. దాయాది దేశం పాకిస్థాన్​ ఆఖరి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. శనివారం (నవంబర్ 11) పాక్​ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. ఇంగ్లాండ్​ నాకౌట్​ దశకు దూరమైంది. పాకిస్థాన్​కు మాత్రం ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, పాక్​ సెమీస్​కు చేరాలంటే ఈ మ్యాచ్​లో పాక్​ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితే పాక్​ కెప్టెన్ బాబర్​ అజామ్​కు లైఫ్​ అండ్​ డెత్​ సమస్యగా పరిణమించింది.

కెప్టెన్సీకి బాబర్​ గుడ్​బై!
2023 ప్రపంచ కప్‌లో అంచనాలు అందుకోలేకపోవడం, పేలవమైన ప్రదర్శన వల్ల బాబర్ అజామ్​ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ నుంచి దిగిపోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ తర్వాత వైట్ బాల్ జట్టు కెప్టెన్సీకి దూరం కానున్నట్లు సమాచారం. పాక్​కు తిరిగి వెళ్లిన తర్వాత పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్​ రజాతో కలిసిన తర్వాత.. బాబర్​ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని తెలుస్తోంది. వారి నుంచి వచ్చే సూచనల మేరకు కెప్టెన్​గా ఉండాలా వద్దా అనే నిర్ణయం ఉండొచ్చని సమాచారం. అయితే ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాబర్ సారథిగా కొనసాగే అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ వరల్డ్​ కప్​లో ఇప్పటివరకు జరిగిన పాక్​ ప్లేయర్స్​ అన్ని మ్యాచ్​లో నిరాశపర్చారు. బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించుకున్నా.. బౌలర్ల నుంచి మాత్రం సహకారం లభించలేదు. దీంతో టీమ్​ భారీ స్కోర్లు నమోదు చేసినా.. విజయ తీరాలకు చేరలేదు. అయితే, జట్టు విఫలమవడం వల్ల.. ఆ మొత్తం భారం సారథి బాబర్ అజామ్​పైనే పడుతోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తర్వాత ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో శనివారం పాక్​ ఇంగ్లాండ్​తో తలపడుతోంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే పాకిస్థాన్​కు 10 పాయింట్లు వస్తాయి. అయితే ఇప్పటికే కివీస్​ జట్టు 10 పాయింట్లతోపాటు మెరుగైన రన్ రేట్‌తో సెమీస్​కు అర్హత సాధించింది. ఇప్పుడు న్యూజిలాండ్​ను వెనక్కు నెట్టి.. పాకిస్థాన్ సెమీస్​ బెర్త్​ సాధించాలంటే.. ఇంగ్లాండ్​పై 287 పరుగుల తేడాతో ఓడించాలి. ఈ నేపథ్యంలో పరిస్థితుల్లో పాకిస్థాన్​కు ఈ సవాల్​గా మారింది.

'అలా చేయడం కన్నా కొత్త షాట్లు నేర్చుకోవడమే నయం'

వరల్డ్​ కప్​లో కొత్త మెరుపులు - సీనియర్స్​ ఉన్నా యంగ్​ ప్లేయర్ల హవా!

Last Updated : Nov 11, 2023, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.