ICC Womens T20 Ranking: ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా ప్లేయర్లు అదరగొట్టారు. భారత ఓపెనర్ స్మృతి మంధాన(730 పాయింట్లు), బౌలర్ దీప్తి శర్మ(742 పాయింట్లు).. తమ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్లను సొంతం చేసుకున్నారు. వీరిద్దరు తమ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండో స్థానానికి చేరుకున్నారు.
మహిళల ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో మంధాన 25 బంతుల్లో 51 పరుగులతో మెరిసింది. ఈ అద్భుత ప్రదర్శనతోనే ఆమె ర్యాంకింగ్స్లో తాజా ఘనత సాధించింది. ఇక దీప్తి.. ఆసియా కప్ ఫైనల్లో నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చింది. అలాగే థాయ్లాండ్తో జరిగిన సెమీస్లోనూ ఏడు ఓవర్లలో మూడు వికెట్లు తీసింది. ఆసియా కప్లో మొత్తంగా 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచింది. దీంతో 742 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ కంటే 14 పాయింట్లు వెనకబడి ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలిచింది. అలానే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్లోనూ మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆల్రౌండ్ విభాగంలో తొలి స్థానంలో వెస్ట్ ఇండీస్కు చెందిన హేలీ మ్యాథ్యూస్(377), రెండో స్థానంలో న్యూజిలాండ్కు చెందిన సోఫీ డివైన్(390) నిలిచారు.
ఇక ఫాస్ట్ బౌలర్ రేణుక సింగ్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్ బెస్ట్ మూడో స్థానానికి చేరుకుంది. అలాగే స్నేహ్ రానా కూడా కెరీర్ బెస్ట్ పదో ర్యాంకుకు చేరుకుంది.
ఇవీ చదవండి: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. ఎన్నిక ఏకగ్రీవం