న్యూజిలాండ్తో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం జట్టులో యువ బౌలర్ అర్జాన్ నగ్వస్వల్లా పేరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. ఆసక్తికర విషయం చెప్పాడు. కెప్టెన్ కోహ్లీని ఇప్పటివరకు కలవలేదని చెప్పాడు.
గతంలో ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్కు ఇతడు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్లో అయినా చోటు దక్కించుకోలేకపోయాడు. "ముంబయి జట్టులో ఉన్నప్పుడు నేను ఆరాధించే రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ను కలిశాను. కానీ ఇప్పటివరకు కోహ్లీని కలవలేదు. అతడితో ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం నన్ను ఎంపికచేయడం ఆశ్యర్యమేసింది. నాలాంటి బౌలర్కు అక్కడి పిచ్ పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. అక్కడ ఆడేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను." అని అర్జాన్ అన్నాడు.
తాను క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి గల కారణాన్ని చెప్పాడు అర్జాన్. "2011 ప్రపంచకప్ నా జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం. అది నన్ను ఎంతో ఆకట్టుకుంది. క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి స్ఫూర్తినిచ్చింది"అని వెల్లడించాడు.
ఇదీ చూడండి: ఎవరీ అర్జాన్ నగ్వస్వల్లా.. ఎంతలా ఆకట్టుకోగలడు?