బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నీల్ వాగ్నర్, మాట్ హెన్రీ తలో మూడు వికెట్లతో రాణించి మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. రెండు టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్ డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్లో కివీస్ విజయ కేతనం ఎగురవేసింది. దీంతో 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది పర్యటక జట్టు.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌట్ కాగా న్యూజిలాండ్ 388 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 122కే కుప్పకూలింది. దీంతో 41 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాథమ్ సేన... 10.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో.. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది కివీస్.
ఇదీ చదవండి: Rohith Sharma: 'రోహిత్ అలా టెస్ట్ల్లో ఓపెనర్గా మారాడు'