ETV Bharat / sports

భళా హర్మన్​ప్రీత్​.. మిథాలీ రికార్డ్ బ్రేక్

author img

By

Published : Jun 26, 2022, 2:09 PM IST

Harmanpreet kaur T20 record: టీమ్​ఇండియా మహిళా టీ20 జట్టు కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్..​ మాజీ ప్లేయర్​ మిథాలీ రాజ్​ రికార్డ్​ను బద్దలుకొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో చెలరేగిన హర్మన్​ప్రీత్​.. అత్యధిక పరుగులు చేసిన భారత టీ20 బ్యాటర్​గా నిలిచింది. 123 మ్యాచుల్లో 2372 పరుగులు చేసింది.

Harmanpreet kaur
హర్మన్​ప్రీత్​ కౌర్

Harmanpreet kaur T20 record: టీమ్​ఇండియా మహిళా జట్టు కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ సరికొత్త రికార్డ్​ సృష్టించింది. భారత్​ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా నిలిచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించింది. 31 పరుగులు చేసిన ఈమె మాజీ కెప్టెన్​ మిథాలీ రాజ్​ పేరున ఉన్న రికార్డ్​ను తిరగరాసింది. ఆమెను వెనక్కు నెట్టి.. అత్యధిక టీ20 పరుగులు చేసిన టీమ్​ఇండియా ప్లేయర్​గా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 123 మ్యాచుల్లో 27 సగటుతో 2,372 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ.. ఆరు హాఫ్​సెంచరీలు ఉన్నాయి. మిథాలీ క్రికెట్​ నుంచి తప్పుకున్న 16 రోజులకే ఈ రికార్డ్​ బద్దలవడం విశేషం.

శ్రీలంక పర్యటనలో భాగంగా దంబుల్లా వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో భారత్​ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్మన్​ప్రీత్​ కెప్టెన్​ ఇన్నింగ్స్​ (31 పరుగలు) సహా ఓపెనర్​ స్మృతి మంధాన (39 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో 2-0తో భారత్​ సిరీస్​ను కైవసం చేసుకుంది.

టీమ్​ఇండియా జట్టుకు సుదీర్ఘకాలంపాటు సారథిగా బాధ్యతలు చేపట్టిన మిథాలీ రాజ్​.. క్రికెట్​ నుంచి తప్పుకునే వరకు భారత్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డ్​ హోల్డర్​గా ఉంది. 89 టీ20లు ఆడిన మిథాలీ.. 38 సగటుతో 17 అర్థశతకాలు నమోదు చేసింది. మొత్తం 2,364 పరుగులను నమోదు చేసింది.

ఇదీ చూడండి : పసికూనతో టీమ్​ఇండియా ఢీ.. తక్కువ అంచనా వేస్తే కష్టమే!

Harmanpreet kaur T20 record: టీమ్​ఇండియా మహిళా జట్టు కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ సరికొత్త రికార్డ్​ సృష్టించింది. భారత్​ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా నిలిచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించింది. 31 పరుగులు చేసిన ఈమె మాజీ కెప్టెన్​ మిథాలీ రాజ్​ పేరున ఉన్న రికార్డ్​ను తిరగరాసింది. ఆమెను వెనక్కు నెట్టి.. అత్యధిక టీ20 పరుగులు చేసిన టీమ్​ఇండియా ప్లేయర్​గా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 123 మ్యాచుల్లో 27 సగటుతో 2,372 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ.. ఆరు హాఫ్​సెంచరీలు ఉన్నాయి. మిథాలీ క్రికెట్​ నుంచి తప్పుకున్న 16 రోజులకే ఈ రికార్డ్​ బద్దలవడం విశేషం.

శ్రీలంక పర్యటనలో భాగంగా దంబుల్లా వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో భారత్​ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్మన్​ప్రీత్​ కెప్టెన్​ ఇన్నింగ్స్​ (31 పరుగలు) సహా ఓపెనర్​ స్మృతి మంధాన (39 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో 2-0తో భారత్​ సిరీస్​ను కైవసం చేసుకుంది.

టీమ్​ఇండియా జట్టుకు సుదీర్ఘకాలంపాటు సారథిగా బాధ్యతలు చేపట్టిన మిథాలీ రాజ్​.. క్రికెట్​ నుంచి తప్పుకునే వరకు భారత్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డ్​ హోల్డర్​గా ఉంది. 89 టీ20లు ఆడిన మిథాలీ.. 38 సగటుతో 17 అర్థశతకాలు నమోదు చేసింది. మొత్తం 2,364 పరుగులను నమోదు చేసింది.

ఇదీ చూడండి : పసికూనతో టీమ్​ఇండియా ఢీ.. తక్కువ అంచనా వేస్తే కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.