హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అంబుడ్స్మన్, ఎథిక్స్ అధికారిని తానే అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ వర్మ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం తాను పంపిన మెయిల్లోని అంశాలను తప్పుగా అర్థం చేసుకుని, తాను అంబుడ్స్మన్గా తప్పుకున్నానని వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆయన సాయంత్రం మరో మెయిల్లో స్పష్టతనిచ్చారు.
"హెచ్సీఏ అంబుడ్స్మన్, ఎథిక్స్ అధికారిగా ఇద్దరు వేర్వేరు మాజీ న్యాయమూర్తులను నియమించినట్లు కార్యదర్శి విజయానంద్ నుంచి నాకు లేఖ అందింది. ఈ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఉన్న గొడవల్లోకి నన్ను లాగొద్దు" అని తన మొదటి మెయిల్లో ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన అంబుడ్స్మన్గా తప్పుకున్నారంటూ ఓ వర్గం ప్రచారం చేసింది.
ఇదీ చదవండి: దిల్లీ X ముంబయి: మూడో గెలుపు ఎవరిదో?
అందుకు స్పందించిన ఆయన.. "గతంలో చెప్పినట్లుగా నేను అంబుడ్స్మన్గా బాధ్యతలు స్వీకరించా. నేను పంపిన మెయిల్లోని విషయాలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పటికీ నేనే అంబుడ్స్మన్ను. పదవి కాలం పూర్తయేవరకూ ఆ బాధ్యతల్లో ఉంటా" అని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'పోటీల్లో రాణిస్తాం.. ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాం'