ETV Bharat / sports

'స్పిన్​ పిచ్​లపై అంత రాద్ధాంతం ఎందుకు?'

author img

By

Published : Mar 3, 2021, 3:30 PM IST

స్పిన్​ ట్రాక్​లపై ప్రస్తుతం అనవసర రాద్ధాంతం జరుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అన్నాడు. గతంలో తమ జట్టు అతితక్కువ ఓవర్లలోనే వికెట్లు చేజార్చుకున్నా.. ఆ పిచ్​లపై ఎలాంటి విమర్శలు చేయలేదని గుర్తుచేశాడు.

Too much noise about spin-friendly tracks: Kohli
'స్పిన్​ పిచ్​లపై అంత రాద్ధాంతం ఎందుకు?'

భారత్​లో స్పిన్​కు అనుకూలమైన మైదానాలే ఎక్కువ అని తెలిసినా.. దానిపై రాద్ధాంతం చేయడం తగదని అన్నాడు టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. గతంలో తమ జట్టు అనేక టెస్టుల్లో ఓడినా.. ఎప్పుడూ ఇలాంటి విమర్శలు చేయలేదని మీడియా సమావేశంలో వెల్లడించాడు.

"స్పిన్​ ట్రాక్​ల గురించి అనవసర వాదన జరుగుతోంది. స్పిన్​ పిచ్​లను మాత్రమే టార్గెట్​ చేసుకొని విమర్శలు చేయడం తగదు. దురదృష్టకర విషయం ఏమిటంటే.. ప్రతి ఒక్కరూ వారికి అనుకూలమైన విషయాలను వార్తలుగా మలుస్తారు. ఒకవేళ ఆ టెస్టులో నాలుగో రోజున లేదా ఐదో రోజున మేము గెలిచి ఉంటే వాళ్ల అభిప్రాయం వేరుగా ఉండేది. అలాంటి వాటిపై ఎవరూ మాట్లాడరు. కానీ, మేము రెండు రోజుల్లోనే ఆటను ముగించామన్నది వాళ్ల ప్రధానసమస్య. దాన్నే ప్రస్తావిస్తున్నారే తప్పా.. మిగిలిన అంశాల గురించి మాట్లాడలేకపోతున్నారు".

- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

ఈ సందర్భంగా న్యూజిలాండ్​లో సీమింగ్​ పిచ్​పై టీమ్ఇండియా ఓడిన టెస్టు​ గురించి కోహ్లీ ప్రస్తావించాడు. "న్యూజిలాండ్​తో ఆడిన టెస్టు మూడో రోజున 36 ఓవర్ల మాత్రమే ఆడి తమ జట్టు ఓడింది. కానీ, ఆ రోజున పిచ్​ గురించి మాట్లాడిన వారు లేరు. ఎందుకంటే ఆ మ్యాచ్​లో టీమ్ఇండియా సరైన ప్రదర్శన చేయలేకపోయింది. కానీ, మా టీమ్ ఎప్పుడూ పిచ్​లపై ఫిర్యాదు చేయలేదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రదర్శన చేస్తూ వచ్చాం. అందుకే మా జట్టు విజయవంతంగా కొనసాగుతోంది" అని కోహ్లీ అన్నాడు.

ఇదీ చూడండి: మూడో టెస్టులో తప్పు మాదే: ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్

భారత్​లో స్పిన్​కు అనుకూలమైన మైదానాలే ఎక్కువ అని తెలిసినా.. దానిపై రాద్ధాంతం చేయడం తగదని అన్నాడు టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. గతంలో తమ జట్టు అనేక టెస్టుల్లో ఓడినా.. ఎప్పుడూ ఇలాంటి విమర్శలు చేయలేదని మీడియా సమావేశంలో వెల్లడించాడు.

"స్పిన్​ ట్రాక్​ల గురించి అనవసర వాదన జరుగుతోంది. స్పిన్​ పిచ్​లను మాత్రమే టార్గెట్​ చేసుకొని విమర్శలు చేయడం తగదు. దురదృష్టకర విషయం ఏమిటంటే.. ప్రతి ఒక్కరూ వారికి అనుకూలమైన విషయాలను వార్తలుగా మలుస్తారు. ఒకవేళ ఆ టెస్టులో నాలుగో రోజున లేదా ఐదో రోజున మేము గెలిచి ఉంటే వాళ్ల అభిప్రాయం వేరుగా ఉండేది. అలాంటి వాటిపై ఎవరూ మాట్లాడరు. కానీ, మేము రెండు రోజుల్లోనే ఆటను ముగించామన్నది వాళ్ల ప్రధానసమస్య. దాన్నే ప్రస్తావిస్తున్నారే తప్పా.. మిగిలిన అంశాల గురించి మాట్లాడలేకపోతున్నారు".

- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

ఈ సందర్భంగా న్యూజిలాండ్​లో సీమింగ్​ పిచ్​పై టీమ్ఇండియా ఓడిన టెస్టు​ గురించి కోహ్లీ ప్రస్తావించాడు. "న్యూజిలాండ్​తో ఆడిన టెస్టు మూడో రోజున 36 ఓవర్ల మాత్రమే ఆడి తమ జట్టు ఓడింది. కానీ, ఆ రోజున పిచ్​ గురించి మాట్లాడిన వారు లేరు. ఎందుకంటే ఆ మ్యాచ్​లో టీమ్ఇండియా సరైన ప్రదర్శన చేయలేకపోయింది. కానీ, మా టీమ్ ఎప్పుడూ పిచ్​లపై ఫిర్యాదు చేయలేదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రదర్శన చేస్తూ వచ్చాం. అందుకే మా జట్టు విజయవంతంగా కొనసాగుతోంది" అని కోహ్లీ అన్నాడు.

ఇదీ చూడండి: మూడో టెస్టులో తప్పు మాదే: ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.