ETV Bharat / sports

శిఖర్​ ధావన్​ స్థానంలో రిషభ్​ పంత్​!​

ఓపెనర్​ శిఖర్​ ధావన్​కు గాయమవడం వల్ల ముందు జాగ్రత్తగా భారత్​ యువ క్రికెటర్ పంత్​ను ప్రపంచకప్​ జట్టులో చేర్చింది బీసీసీఐ. పంత్​ ఇంగ్లాండ్​కు​ పయనమయ్యాడు. గురువారం భారత్​- న్యూజిలాండ్​ మ్యాచ్​ ముందు యువ వికెట్​ కీపర్​​ జట్టులో చేరుతాడు.

author img

By

Published : Jun 12, 2019, 12:51 PM IST

శిఖర్​ ధావన్​ స్థానంలో రిషబ్​ పంత్​?​

భారత ప్రపంచకప్​ జట్టులో యువ క్రికెటర్​ రిషభ్​ పంత్​ చేరనున్నాడు. ఓపెనర్​ శిఖర్​ ధావన్​ గాయపడటం వల్ల ముందు జాగ్రత్తగా పంత్​ను జట్టులోకి తీసుకుంటున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

గురువారం భారత్​- న్యూజిలాండ్​ మ్యాచ్​కు ముందు పంత్​ జట్టులో చేరనున్నాడు. ధావన్​​​పై జట్టు మేనేజ్​మెంట్​ తుది నిర్ణయం తీసుకునే వరకు అతడి​ స్థానంలో పంత్​ ఆడబోడని బీసీసీఐ స్పష్టం చేసింది. ధావన్​ ప్రస్తుతం జట్టు ఫిజియోల పర్యవేక్షణలో ఇంగ్లాండ్​లోనే ఉన్నాడు.

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ధావన్​ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. ఈ నేపథ్యంలో ధావన్​ కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

21 ఏళ్ల వికెట్​ కీపర్​కు 15 సభ్యుల ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

2018లో ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆకట్టుకున్న పంత్​... సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ధావన్​ ఆడలేని తరుణంలో రిషభ్ పంత్​ను ఎంపిక చేయాలని భారత క్రికెట్​ దిగ్గజం సునీల్​ గవాస్కర్​ సహా పలువురు సూచించారు.

భారత ప్రపంచకప్​ జట్టులో యువ క్రికెటర్​ రిషభ్​ పంత్​ చేరనున్నాడు. ఓపెనర్​ శిఖర్​ ధావన్​ గాయపడటం వల్ల ముందు జాగ్రత్తగా పంత్​ను జట్టులోకి తీసుకుంటున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

గురువారం భారత్​- న్యూజిలాండ్​ మ్యాచ్​కు ముందు పంత్​ జట్టులో చేరనున్నాడు. ధావన్​​​పై జట్టు మేనేజ్​మెంట్​ తుది నిర్ణయం తీసుకునే వరకు అతడి​ స్థానంలో పంత్​ ఆడబోడని బీసీసీఐ స్పష్టం చేసింది. ధావన్​ ప్రస్తుతం జట్టు ఫిజియోల పర్యవేక్షణలో ఇంగ్లాండ్​లోనే ఉన్నాడు.

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ధావన్​ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. ఈ నేపథ్యంలో ధావన్​ కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

21 ఏళ్ల వికెట్​ కీపర్​కు 15 సభ్యుల ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

2018లో ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆకట్టుకున్న పంత్​... సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ధావన్​ ఆడలేని తరుణంలో రిషభ్ పంత్​ను ఎంపిక చేయాలని భారత క్రికెట్​ దిగ్గజం సునీల్​ గవాస్కర్​ సహా పలువురు సూచించారు.

Intro:Body:

zx


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.