2011 ప్రపంచకప్ తర్వాత కెరీర్లో యువరాజ్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే కారణమని ఆరోపించారు యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్. తన కుమారుడు జట్టులో ఉండేందుకు ధోని ఇష్టపడేవాడు కాదని అన్నారు.
'కెప్టెన్గా యువరాజ్ బదులు ధోని'
కెప్టెన్గా యువరాజ్కే ముందు అవకాశమొచ్చిందని, కానీ చివరి నిమిషంలో ధోనికి దక్కిందని చెప్పారు యోగ్రాజ్. ఆ తర్వాత యువీతో మాత్రమే కాకుండా చాలా మంది ఆటగాళ్లతో ధోని దురుసుగా ప్రవర్తించేవాడని అన్నారు. అతడికి జట్టు కంటే కెప్టెన్సీ అంటేనే ఎక్కువ ఇష్టమని, అందుకే అలా ఉండేవాడని చెప్పారు. ధోని స్నేహితుడు కావడం వల్ల యువరాజ్ దీని గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదని అన్నారు.
'ఆరోగ్యం సహకరించకపోయినా యువీ ఆడాడు'
భారత్ క్రికెట్ జట్టులో యువరాజ్ కంటే మంచి క్రికెటర్ను ఇప్పటివరకు చూడలేదని చెప్పారు యోగ్రాజ్ సింగ్. 2011 ప్రపంచకప్ సమయంలో యువీకి క్యాన్సర్ అని తెలిసి ఆడొద్దని చెప్పానని, అయినా ప్రాణం కన్నా దేశం తరఫున ఆడేందుకు అతడు అధిక ప్రాధాన్యమిచ్చేవాడని అన్నారు.
'టీమిండియా కప్పు కొడుతుంది'
ప్రస్తుత ప్రపంచకప్లో కోహ్లీసేన అద్భుతంగా ఆడుతుందని చెప్పారు యోగ్రాజ్. ఇదే ఫామ్ కొనసాగించి కప్పు కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: ఇంగ్లాండ్తో భారత్ ఢీ.. గెలిస్తే సెమీస్కు