కరోనా వైరస్ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు ఇంటికే పరిమితమైపోయారు. కేఎల్ రాహుల్ కూడా ఇంటి వద్దే సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఈ ఆటగాడు సామాజిక మాధ్యమాల్లో తన రోజు ఎలా గడుస్తుందో ఓ వీడియో ద్వారా వివరించాడు.
ఈ వీడియోలో మొదట కాసేపు బ్యాట్, బంతితో గడిపిన రాహుల్ తర్వాత గేమ్ ఆడుతూ, అనంతరం పుస్తకం చదువుతూ, కాసేపు మొబైల్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఈ ఆటగాడు దానికి 'స్టే హోమ్ ఛాలెంజ్'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కొంతకాలంగా మంచి ఫామ్లో కనిపిస్తోన్న రాహుల్ వన్డే, టీ20ల్లో సత్తచాటుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో మొత్తం 224 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్గా ఘనత వహించాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు రాహుల్. ఇతడి సారథ్యంలో జట్టు ఈసారి మంచి ప్రదర్శన చేస్తుందని భావిస్తోంది యాజమాన్యం.