ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ టెస్టు: భారత ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు - IND vs ENG pink ball test

భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు నేడు జరగబోతుంది. అహ్మదాబాద్ మొతేరా వేదికగా జరిగే ఈ డేనైట్​ టెస్టుకు ముందు పలు రికార్డులు టీమ్ఇండియా ఆటగాళ్లను ఊరిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

Ashwin
Team india
author img

By

Published : Feb 24, 2021, 9:00 AM IST

భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ మొతేరా వేదికగా బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభంకానుంది. టీమ్ఇండియా స్వదేశంలో ఆడబోతున్న రెండో డేనైట్ టెస్టు ఇది. మొత్తం నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో ఇప్పటికీ ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ గులాబీ బంతి టెస్టు రెండు జట్లకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా టీమ్ఇండియా ఆటగాళ్లు నెలకొల్పబోయే రికార్డులేంటో చూద్దాం.

  • స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్​లుగా ప్రస్తుతం ధోనీ (21), కోహ్లీ (21) సమానంగా ఉన్నారు. ఈ మ్యాచ్​లో విజయం సాధిస్తే మహీ రికార్డును తిరగరాసి భారత గడ్డపై జట్టుకు ఎక్కువ టెస్టు విజయాలు అందించిన టెస్టు సారథిగా నిలుస్తాడు విరాట్. ఇక్కడ ధోనీ 30 టెస్టులకు కెప్టెన్సీ చేయగా, కోహ్లీ 28 మ్యాచ్​లకు సారథ్యం వహించాడు.
    Virat Kohli,
    కోహ్లీ
  • కెప్టెన్​గా ఎక్కువ సెంచరీలు సాధించిన వారి జాబితాలో ప్రస్తుతం పాంటింగ్ సరసన నిలిచాడు కోహ్లీ. ప్రస్తుతం 41 సెంచరీలతో ఉన్నాడు. ఈ మ్యాచ్​లో శతకం సాధిస్తే పాంటింగ్​ను దాటి వెళతాడు. 2019 నవంబర్​లో బంగ్లాదేశ్​తో జరిగిన డేనైట్ టెస్టు తర్వాత ఇప్పటివరకు కోహ్లీ ఒక్క సెంచరీ సాధించలేకపోయాడు.
  • భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​లో ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో ముందున్నారు అజారుద్దీన్, కెవిన్ పీటర్సన్. వీరిద్దరూ 6 శతకాలు సాధించారు. ప్రస్తుతం ఐదు సెంచరీలు చేసిన కోహ్లీ మరో శతకం బాదితే వీరి సరసన చేరతాడు. పుజారా కూడా ఐదు సెంచరీల వద్ద ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్, అలిస్టర్ కుక్ ఏడు శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
  • స్వదేశంలో ఇంగ్లాండ్​పై 1000 పరుగులు సాధించిన మూడో టీమ్ఇండియా క్రికెటర్​గా నిలవడానికి మరో 12 రన్స్ దూరంలో ఉన్నాడు కోహ్లీ. సునీల్ గావస్కర్ (1331), గుండప్ప విశ్వనాథ్ (1022) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  • అంతర్జాతీయ క్రికెట్​లో ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్​మెన్​గా నిలవడానికి మరో శతకం దూరంలో ఉన్నాడు కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ 70 శతకాలతో పాంటింగ్​ (71) తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 100 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
  • 400 టెస్టు వికెట్ల క్లబ్​లో చేరడానికి మరో ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. 76 టెస్టుల్లో ప్రస్తుతం 394 వికెట్లు సాధించాడు అశ్విన్. ఒకవేళ ఈ మ్యాచ్​తో 400 వికెట్ల క్లబ్​లో చేరితే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్​గా నిలుస్తాడీ టీమ్ఇండియా స్పిన్నర్. మురళీధరన్ 72 టెస్టుల్లో ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.
    Ashwin
    అశ్విన్
  • అలాగే మరో 6 వికెట్లు సాధిస్తే 400 వికెట్ల క్లబ్​లో చేరిన నాలుగో భారత బౌలర్​గా ఘనత వహిస్తాడు అశ్విన్. హర్భజన్ సింగ్ (417), కపిల్ దేవ్ (434), అనిల్ కుంబ్లే (619) ముందున్నారు.
  • టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఇది 100వ టెస్టు. ఈ ఘనత సాధించబోతున్న 11వ భారత బౌలర్ ఇషాంత్. ఇప్పటివరకు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, కుంబ్లే, హర్భజన్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్​సర్కార్, సునీల్ గావస్కర్, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ​
    Ishanth
    ఇషాంత్

భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ మొతేరా వేదికగా బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభంకానుంది. టీమ్ఇండియా స్వదేశంలో ఆడబోతున్న రెండో డేనైట్ టెస్టు ఇది. మొత్తం నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో ఇప్పటికీ ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ గులాబీ బంతి టెస్టు రెండు జట్లకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా టీమ్ఇండియా ఆటగాళ్లు నెలకొల్పబోయే రికార్డులేంటో చూద్దాం.

  • స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్​లుగా ప్రస్తుతం ధోనీ (21), కోహ్లీ (21) సమానంగా ఉన్నారు. ఈ మ్యాచ్​లో విజయం సాధిస్తే మహీ రికార్డును తిరగరాసి భారత గడ్డపై జట్టుకు ఎక్కువ టెస్టు విజయాలు అందించిన టెస్టు సారథిగా నిలుస్తాడు విరాట్. ఇక్కడ ధోనీ 30 టెస్టులకు కెప్టెన్సీ చేయగా, కోహ్లీ 28 మ్యాచ్​లకు సారథ్యం వహించాడు.
    Virat Kohli,
    కోహ్లీ
  • కెప్టెన్​గా ఎక్కువ సెంచరీలు సాధించిన వారి జాబితాలో ప్రస్తుతం పాంటింగ్ సరసన నిలిచాడు కోహ్లీ. ప్రస్తుతం 41 సెంచరీలతో ఉన్నాడు. ఈ మ్యాచ్​లో శతకం సాధిస్తే పాంటింగ్​ను దాటి వెళతాడు. 2019 నవంబర్​లో బంగ్లాదేశ్​తో జరిగిన డేనైట్ టెస్టు తర్వాత ఇప్పటివరకు కోహ్లీ ఒక్క సెంచరీ సాధించలేకపోయాడు.
  • భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​లో ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో ముందున్నారు అజారుద్దీన్, కెవిన్ పీటర్సన్. వీరిద్దరూ 6 శతకాలు సాధించారు. ప్రస్తుతం ఐదు సెంచరీలు చేసిన కోహ్లీ మరో శతకం బాదితే వీరి సరసన చేరతాడు. పుజారా కూడా ఐదు సెంచరీల వద్ద ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్, అలిస్టర్ కుక్ ఏడు శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
  • స్వదేశంలో ఇంగ్లాండ్​పై 1000 పరుగులు సాధించిన మూడో టీమ్ఇండియా క్రికెటర్​గా నిలవడానికి మరో 12 రన్స్ దూరంలో ఉన్నాడు కోహ్లీ. సునీల్ గావస్కర్ (1331), గుండప్ప విశ్వనాథ్ (1022) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  • అంతర్జాతీయ క్రికెట్​లో ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్​మెన్​గా నిలవడానికి మరో శతకం దూరంలో ఉన్నాడు కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ 70 శతకాలతో పాంటింగ్​ (71) తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 100 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
  • 400 టెస్టు వికెట్ల క్లబ్​లో చేరడానికి మరో ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. 76 టెస్టుల్లో ప్రస్తుతం 394 వికెట్లు సాధించాడు అశ్విన్. ఒకవేళ ఈ మ్యాచ్​తో 400 వికెట్ల క్లబ్​లో చేరితే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్​గా నిలుస్తాడీ టీమ్ఇండియా స్పిన్నర్. మురళీధరన్ 72 టెస్టుల్లో ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.
    Ashwin
    అశ్విన్
  • అలాగే మరో 6 వికెట్లు సాధిస్తే 400 వికెట్ల క్లబ్​లో చేరిన నాలుగో భారత బౌలర్​గా ఘనత వహిస్తాడు అశ్విన్. హర్భజన్ సింగ్ (417), కపిల్ దేవ్ (434), అనిల్ కుంబ్లే (619) ముందున్నారు.
  • టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఇది 100వ టెస్టు. ఈ ఘనత సాధించబోతున్న 11వ భారత బౌలర్ ఇషాంత్. ఇప్పటివరకు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, కుంబ్లే, హర్భజన్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్​సర్కార్, సునీల్ గావస్కర్, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ​
    Ishanth
    ఇషాంత్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.