ETV Bharat / sports

భారత్​Xఇంగ్లాండ్​: చెన్నైలో ఆధిపత్యం ఎవరిదంటే?

author img

By

Published : Jan 26, 2021, 10:28 AM IST

ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో తొలి రెండు మ్యాచ్​లు చెన్నై ఎం​ఏ చిదంబరం స్టేడియం (చెపాక్)​లో జరగనున్నాయి. ఈ మైదానంలో గతంలో తలపడిన ఈ ఇరు జట్ల రికార్డులపై ఓ లుక్కేద్దాం.

chepak
చెపక్​

భారత పర్యటనకు రానున్న ఇంగ్లాండ్​.. ఫిబ్రవరి 5 నుంచి టెస్టులతో సిరీస్​ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తొలి రెండు మ్యాచులు చెన్నై ఎం​ఏ చిదంబరం స్టేడియం (చెపాక్)​లో జరగనున్నాయి. అయితే ఈ వేదికపై ముఖాముఖిలో భారత్​కు మంచి రికార్డు ఉంది. ఓ సారి ఆ రికార్డులను పరిశీలిద్దాం.

ind vs eng
భారత్​-ఇంగ్లాండ్​ రికార్డు

ఈ మైదానంలో భారత్​-ఇంగ్లాండ్​ టెస్టుల్లో తొమ్మిదిసార్లు తలపడగా.. టీమ్​ఇండియా ఐదు సార్లు, ఇంగ్లీష్​ జట్టు మూడు సార్లు గెలిచింది. 1982లో జరిగిన ఓ మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

చివరిసారిగా 2016లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్​పై ఇన్నింగ్స్​ 75 పరుగుల తేడాతో భారత్​ గెలిచింది. ఈ మ్యాచులో భారత ఆటగాడు​ కరుణ్​​​ నాయర్.. టెస్టు క్రికెట్​లో మాజీ క్రికెటర్​ సెహ్వాగ్​ తర్వాత ట్రిపుల్​ సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.

మొత్తంగా ఈ​ స్టేడియంలో టీమ్​ఇండియా 32 టెస్టులు ఆడగా.. 14 గెలిచి, ఆరింట ఓడింది. 11 డ్రాగా ముగిశాయి. 1986లో ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్​ టై అయింది.

తొలిసారి..

1934లో తొలిసారి ఇరుజట్ల మధ్య చెన్నైలో మ్యాచ్​ జరగగా.. భారత్​ ఓడిపోయింది. సీకే నాయుడు సారథ్యంలోని టీమ్​ఇండియా 202 పరుగుల భారీ తేడాతో ఓటమి చెందింది.

ఇప్పుడు.. ఫిబ్రవరి 5-9 మధ్య తొలి, 13-17 మధ్య రెండో టెస్టుకు చెన్నైనే వేదిక.

chepak
చెపక్​

షెడ్యూల్​ ఇదే

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.

chepak
చెపక్​

ఇదీ చూడండి: 27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు

భారత పర్యటనకు రానున్న ఇంగ్లాండ్​.. ఫిబ్రవరి 5 నుంచి టెస్టులతో సిరీస్​ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తొలి రెండు మ్యాచులు చెన్నై ఎం​ఏ చిదంబరం స్టేడియం (చెపాక్)​లో జరగనున్నాయి. అయితే ఈ వేదికపై ముఖాముఖిలో భారత్​కు మంచి రికార్డు ఉంది. ఓ సారి ఆ రికార్డులను పరిశీలిద్దాం.

ind vs eng
భారత్​-ఇంగ్లాండ్​ రికార్డు

ఈ మైదానంలో భారత్​-ఇంగ్లాండ్​ టెస్టుల్లో తొమ్మిదిసార్లు తలపడగా.. టీమ్​ఇండియా ఐదు సార్లు, ఇంగ్లీష్​ జట్టు మూడు సార్లు గెలిచింది. 1982లో జరిగిన ఓ మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

చివరిసారిగా 2016లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్​పై ఇన్నింగ్స్​ 75 పరుగుల తేడాతో భారత్​ గెలిచింది. ఈ మ్యాచులో భారత ఆటగాడు​ కరుణ్​​​ నాయర్.. టెస్టు క్రికెట్​లో మాజీ క్రికెటర్​ సెహ్వాగ్​ తర్వాత ట్రిపుల్​ సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.

మొత్తంగా ఈ​ స్టేడియంలో టీమ్​ఇండియా 32 టెస్టులు ఆడగా.. 14 గెలిచి, ఆరింట ఓడింది. 11 డ్రాగా ముగిశాయి. 1986లో ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్​ టై అయింది.

తొలిసారి..

1934లో తొలిసారి ఇరుజట్ల మధ్య చెన్నైలో మ్యాచ్​ జరగగా.. భారత్​ ఓడిపోయింది. సీకే నాయుడు సారథ్యంలోని టీమ్​ఇండియా 202 పరుగుల భారీ తేడాతో ఓటమి చెందింది.

ఇప్పుడు.. ఫిబ్రవరి 5-9 మధ్య తొలి, 13-17 మధ్య రెండో టెస్టుకు చెన్నైనే వేదిక.

chepak
చెపక్​

షెడ్యూల్​ ఇదే

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.

chepak
చెపక్​

ఇదీ చూడండి: 27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.