ETV Bharat / sports

అండర్​ 19: 'కంగారు' పెట్టిస్తోన్న భారత​ బౌలర్లు

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్​-19 ప్రపంచకప్​లో యువ భారత్​ అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తోంది. బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను.. టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్​తో బెంబేలెత్తిస్తున్నారు. 234 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కంగారూ జట్టు.

author img

By

Published : Jan 28, 2020, 6:17 PM IST

Updated : Feb 28, 2020, 7:34 AM IST

Under 19 Quarters: India U19 vs Australia U19, Super League Quarter-Final 1
అండర్​ 19 ప్రపంచకప్​: ఆస్ట్రేలియాను బెంబేలెత్తిస్తున్న త్యాగీ

అండర్​-19 ప్రపంచకప్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​, ఫేవరేట్లలో ఒకటైన భారత్​.. మరోసారి సత్తా చాటుతోంది.​ నాకౌట్​ పోరులో ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ను​ వణికిస్తోంది.

త్యాగి అత్యుత్తమంగా...

తొలుత బ్యాటింగ్​ చేసిన యువ టీమిండియా 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే దెబ్బతీశాడు పేసర్​ కార్తీక్​ త్యాగి. కంగారూ జట్టు పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్​ పడగొట్టి పతనం ప్రారంభించారు భారత బౌలర్లు. తొలి బంతికే ఆసీస్​ ఓపెనర్​ గ్రుక్​ను రనౌట్​గా పంపించారు. అదే ఓవర్​ నాలుగో బంతికి హార్వేను ఎల్బీగా ఔట్​ చేసిన త్యాగి.. తర్వాతి బంతికి మరో బ్యాట్స్​మన్​ హెర్నేను బౌల్డ్​ చేశాడు.

ఆ తర్వాత మూడో ఓవర్​లో మళ్లీ బంతి అందుకున్న ఈ యువ ఫాస్ట్​ బౌలర్​.. మరో బ్యాట్స్​మన్​ ఒలీవర్​ను పెవిలియన్​ చేర్చాడు. ఫలితంగా 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు.

మొదట బ్యాటింగ్​ చేసిన యువ భారత్​ బ్యాట్స్​మన్​లో యశస్వి(62), అథర్వ(55) అర్ధ శతకాలతో రాణించారు.

ఇదీ చూడండి...

అండర్​-19: జైస్వాల్, అథర్వ అదరహో.. ఆసీస్ లక్ష్యం 234

అండర్​-19 ప్రపంచకప్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​, ఫేవరేట్లలో ఒకటైన భారత్​.. మరోసారి సత్తా చాటుతోంది.​ నాకౌట్​ పోరులో ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ను​ వణికిస్తోంది.

త్యాగి అత్యుత్తమంగా...

తొలుత బ్యాటింగ్​ చేసిన యువ టీమిండియా 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే దెబ్బతీశాడు పేసర్​ కార్తీక్​ త్యాగి. కంగారూ జట్టు పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్​ పడగొట్టి పతనం ప్రారంభించారు భారత బౌలర్లు. తొలి బంతికే ఆసీస్​ ఓపెనర్​ గ్రుక్​ను రనౌట్​గా పంపించారు. అదే ఓవర్​ నాలుగో బంతికి హార్వేను ఎల్బీగా ఔట్​ చేసిన త్యాగి.. తర్వాతి బంతికి మరో బ్యాట్స్​మన్​ హెర్నేను బౌల్డ్​ చేశాడు.

ఆ తర్వాత మూడో ఓవర్​లో మళ్లీ బంతి అందుకున్న ఈ యువ ఫాస్ట్​ బౌలర్​.. మరో బ్యాట్స్​మన్​ ఒలీవర్​ను పెవిలియన్​ చేర్చాడు. ఫలితంగా 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు.

మొదట బ్యాటింగ్​ చేసిన యువ భారత్​ బ్యాట్స్​మన్​లో యశస్వి(62), అథర్వ(55) అర్ధ శతకాలతో రాణించారు.

ఇదీ చూడండి...

అండర్​-19: జైస్వాల్, అథర్వ అదరహో.. ఆసీస్ లక్ష్యం 234

Intro:దుర్గం సబ్ జైలు లో సచివాలయం


Body:అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం లోని 12వ వార్డు సచివాలయాన్ని స్థానిక పాత సబ్ జైల్ భవనము లో ఏర్పాటు చేశారు ఒకప్పుడు ఖైదీలకు నిలయంగా ఉన్న ఈ గది నేడు ఉద్యోగులకు కార్యాలయంగా మారింది మున్సిపల్ అధికారులు పాత సబ్ జైల్ భవనానికి రంగులద్ది వార్డు సచివాలయం గా సిద్ధం చేసుకున్నారు దీనికి తలుపులు లేవు ఇనుప సూచనలను తలుపులు గా మార్చారు ఇక్కడ కంప్యూటర్లు ఫర్నిచర్ కు భద్రత ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు జైలు గదిలో మూత్రశాల ఉండడంతో సచివాలయం ఉద్యోగుల కు విధులు నిర్వహించడానికి తీవ్ర ఆటంకంగా ఉంది సరైన తాగునీటి వసతి కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఈనెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 12వ వార్డు సచివాలయం గా ప్రారంభించారు సబ్ జైలు లో సచివాలయం ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంబంధిత అధికారులు సచివాలయ భవనాన్ని ఇతర భవనంలోకి మార్చాలని ప్రజలు ఉద్యోగులు కోరుతున్నారు ఈ విషయమై రాయదుర్గం మున్సిపల్ డి ఈ రామమూర్తి ఈటీవీ తో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండడంతో అద్దె భవనం లభ్యం కాలేదు అన్నారు అందుకే తాత్కాలికంగా సబ్ జైలు లో 12వ వార్డు సచివాలయం ప్రారంభించామన్నారు అద్దె భవనం దొరికితే సచివాలయ కార్యాలయాన్ని మారుస్తామని ఆయన తెలిపారు


Conclusion:రామమూర్తి డి ఈ ఈ రాయదుర్గం మున్సిపాలిటీ అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్
Last Updated : Feb 28, 2020, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.