మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభం కానుంది. కరోనా తర్వాత టీమ్ఇండియా ఆడే తొలి సిరీస్ ఇదే కావడం వల్ల క్రీడాప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఆసీస్తో ఇప్పటివరకు జరిగిన పోరుల్లో(అన్ని ఫార్మాట్లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన భారత్కు చెందిన తొలి ముగ్గురు బ్యాట్స్మెన్స్పై ఓ లుక్కేద్దాం.
3. వీవీఎస్ లక్ష్మణ్
సొగసరి బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకున్న టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వీవీఎస్ లక్ష్మణ్.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించిన పోరాట యోధుడు. ఆసీస్తో ఆడిన 73ఇన్నింగ్స్లో 48.81స్ట్రైక్రేట్తో 3,173పరుగులు చేశాడు. అందులో 10శతకాలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి.
ఎప్పటికీ గుర్తుండిపోయేది
2001లో ఈడెన్గార్డెన్స్లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ అందరికీ గుర్తుండిపోతుంది. అందులో లక్ష్మణ్ అజేయంగా 281పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2.విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా కోహ్లీ సారథ్యంలో 2018లో తొలిసారి ఆసీస్ గడ్డపై టీమ్ఇండియా విజేతగా నిలిచింది. మొత్తంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై విరాట్ 87 ఇన్నింగ్స్ ఆడగా.. 53.22 స్ట్రైక్రేట్తో 4,098 పరుగులు చేశాడు. అందులో 15శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.
1.సచిన్ తెందుల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్తెందుల్కర్.. అడుగు పెట్టని మైదానం లేదు, పరుగులు చేయని పిచ్ లేదు, రికార్డు సృష్టించని దేశం లేదు. దేశానికి ఎన్నో విజయాలను అందించాడు. ఆసీస్పై తాను ఆడిన 144 ఇన్నింగ్స్ .. 49.68స్ట్రేక్రేట్తో 6,707పరుగులు చేశాడు. అందులో 20సెంచరీలు, 31అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ పరుగులను ఒక్క టీ20కూడా ఆడకుండానే కేవలం వన్డేలు, టెస్టులులో చేశాడు.
వెలుగులోకి
1991-92లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించింది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో సచిన్ అజేయంగా 148 పరుగులు సాధించి మ్యాచ్ను డ్రాగా ముగించాడు. అప్పుడు అతడి వయసు పద్దెనిమిదేళ్లు. ఈ మ్యాచ్తోనే మాస్టర్ బ్లాస్టర్ వెలుగులోకి వచ్చాడు.
త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే షెడ్యూల్
మూడు వన్డేల సిరీస్తో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన ప్రారంభం కానుంది. నవంబరు 27, 29, డిసెంబరు 2 తేదీల్లో వన్డేలు, డిసెంబరు 4, 6, 8 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత టెస్టులకు అడిలైడ్ (డిసెంబర్ 17-21), మెల్బోర్న్ (డిసెంబర్ 26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.
ఇదీ చూడండి : యువ జోరుకు టీ20 ప్రపంచకప్లో చోటు పక్కా!