32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించి.. 2-1తేడాతో టెస్టు సిరీస్ను గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసిన టీమ్ఇండియా స్వదేశానికి చేరుకుంది. తాత్కాలిక సారథి అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వి షా ముంబయికి చేరుకున్నారు. పంత్ దిల్లీలో అడుగుపెట్టాడు. విమానాశ్రమంలో దిగిన అనంతరం మీడియాతో ముచ్చటించిన వీరు బోర్డర్ గావస్కర్ ట్రోఫీని వరుసగా మూడోసారి సొంతం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
"సిరీస్ గెలిచి ట్రోఫీని మా వద్దే ఉంచుకోవడం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మొత్తం జట్టంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. మాజీ సారథి ధోనీతో నన్ను పోల్చడం ఆనందంగా ఉంది. కానీ నాకంటూ క్రికెట్ చరిత్రలో ఓ గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అందుకోసమే కష్టపడుతున్నాను." అని పంత్ అన్నాడు.
ఇదీ చూడండి : టీమ్ఇండియా ప్రదర్శనపై 'మాజీ సారథి' యూటర్న్