ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ వాయిదాతో ఐపీఎల్​కు గ్రీన్​సిగ్నల్​

author img

By

Published : Jul 21, 2020, 9:40 AM IST

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై అనిశ్చితికి తెరపడింది. కరోనా మహమ్మారి కారణంగా 2020 టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. ఫలితంగా బీసీసీఐ ప్రఖ్యాత లీగ్ ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ నిర్వహణపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీసీసీఐ మరింత దూకుడు పెంచనుంది.

T20 World Cup 2020 postponed due to COVID-19, window open for IPL
టీ20 ప్రపంచకప్​ వాయిదా.. ఐపీఎల్​కు మార్గం సుగమం

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. సోమవారం జరిగిన ఐబీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పొట్టి కప్పు వాయిదా అనివార్యమైనట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో పురుషుల విభాగంలో వరుసగా మూడేళ్లలో మూడు ప్రపంచకప్‌లు క్రికెట్‌ అభిమానులను అలరించనున్నాయి. అందులో రెండు టీ20 ప్రపంచకప్‌లు కాగా.. ఒకటి వన్డే ప్రపంచకప్‌. ఈ మూడు మెగా టోర్నీలు అక్టోబరు-నవంబరు నెలల్లోనే జరగనుండడం విశేషం.

ఈ ఏడాది వాయిదా పడిన టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా వచ్చే ఏడాది నిర్వహిస్తుందా.. అటొచ్చే ఏడాది నిర్వహిస్తుందా అన్నది తేలలేదు. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది భారత్‌ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వాలి. అయితే 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లను భారత్‌, ఆస్ట్రేలియాలు మార్చుకునే అవకాశం ఉందని ఐసీసీ సీఈవో మను సాహ్నే చెప్పాడు.

‘‘అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేశాం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులకు సురక్షితమైన, విజయవంతమైన రెండు టీ20 ప్రపంచకప్‌లను అందించే ఉత్తమమైన అవకాశం లభిస్తుంది. సభ్య దేశాలు తాము కోల్పోయిన ద్వైపాక్షిక సిరీస్‌లు, దేశవాళీ టోర్నీలను తిరిగి షెడ్యూల్‌ చేసుకునేందుకు ఐసీసీ నిర్ణయం దోహద పడుతుందని భావిస్తున్నాం’’

- మను సాహ్నే, ఐసీసీ సీఈఓ

ఇక ఐపీఎల్‌ సన్నాహాలు

టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై సోమవారం ఐసీసీ నిర్ణయం వెల్లడిస్తుందని భావించిన బీసీసీఐ ముందుగానే సన్నాహాలు మొదలుపెట్టింది. గత వారం జరిగిన బీసీసీఐ వర్చువల్‌ సమావేశంలో ఐపీఎల్‌ తేదీలు, వేదికను దాదాపుగా ఖరారు చేసింది. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు యూఏఈలో ఐపీఎల్‌ ఉంటుందని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చేసింది. ఆయా ఫ్రాంచైజీలు సైతం యూఏఈలో వసతి ఏర్పాట్లపై దృష్టిసారించాయి. ఆటగాళ్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. తాజాగా ఐసీసీ నిర్ణయం వెలువడడం వల్ల ఐపీఎల్‌పై బీసీసీఐ మరింత దూకుడు పెంచనుంది. ఏ క్షణమైనా ఐపీఎల్‌ తేదీలు, వేదికను ప్రకటించొచ్చని సమాచారం.

ఏ కప్పు ఎప్పుడు?

2021 టీ20 ప్రపంచకప్‌ అక్టోబరులో మొదలై నవంబరు 14న ముగుస్తుంది. 2022 టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు- నవంబరులో జరుగుతుంది. నవంబరు 13న ఫైనల్‌ ఉంటుంది. భారత్‌ ఆతిథ్యమిచ్చే 2023 వన్డే ప్రపంచకప్‌ కూడా అక్టోబరు- నవంబరులోనే నిర్వహిస్తారు. నవంబరు 26న ఫైనల్‌ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ నిర్వహణపై పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. సోమవారం జరిగిన ఐబీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పొట్టి కప్పు వాయిదా అనివార్యమైనట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో పురుషుల విభాగంలో వరుసగా మూడేళ్లలో మూడు ప్రపంచకప్‌లు క్రికెట్‌ అభిమానులను అలరించనున్నాయి. అందులో రెండు టీ20 ప్రపంచకప్‌లు కాగా.. ఒకటి వన్డే ప్రపంచకప్‌. ఈ మూడు మెగా టోర్నీలు అక్టోబరు-నవంబరు నెలల్లోనే జరగనుండడం విశేషం.

ఈ ఏడాది వాయిదా పడిన టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా వచ్చే ఏడాది నిర్వహిస్తుందా.. అటొచ్చే ఏడాది నిర్వహిస్తుందా అన్నది తేలలేదు. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది భారత్‌ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వాలి. అయితే 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లను భారత్‌, ఆస్ట్రేలియాలు మార్చుకునే అవకాశం ఉందని ఐసీసీ సీఈవో మను సాహ్నే చెప్పాడు.

‘‘అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేశాం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులకు సురక్షితమైన, విజయవంతమైన రెండు టీ20 ప్రపంచకప్‌లను అందించే ఉత్తమమైన అవకాశం లభిస్తుంది. సభ్య దేశాలు తాము కోల్పోయిన ద్వైపాక్షిక సిరీస్‌లు, దేశవాళీ టోర్నీలను తిరిగి షెడ్యూల్‌ చేసుకునేందుకు ఐసీసీ నిర్ణయం దోహద పడుతుందని భావిస్తున్నాం’’

- మను సాహ్నే, ఐసీసీ సీఈఓ

ఇక ఐపీఎల్‌ సన్నాహాలు

టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై సోమవారం ఐసీసీ నిర్ణయం వెల్లడిస్తుందని భావించిన బీసీసీఐ ముందుగానే సన్నాహాలు మొదలుపెట్టింది. గత వారం జరిగిన బీసీసీఐ వర్చువల్‌ సమావేశంలో ఐపీఎల్‌ తేదీలు, వేదికను దాదాపుగా ఖరారు చేసింది. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు యూఏఈలో ఐపీఎల్‌ ఉంటుందని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చేసింది. ఆయా ఫ్రాంచైజీలు సైతం యూఏఈలో వసతి ఏర్పాట్లపై దృష్టిసారించాయి. ఆటగాళ్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. తాజాగా ఐసీసీ నిర్ణయం వెలువడడం వల్ల ఐపీఎల్‌పై బీసీసీఐ మరింత దూకుడు పెంచనుంది. ఏ క్షణమైనా ఐపీఎల్‌ తేదీలు, వేదికను ప్రకటించొచ్చని సమాచారం.

ఏ కప్పు ఎప్పుడు?

2021 టీ20 ప్రపంచకప్‌ అక్టోబరులో మొదలై నవంబరు 14న ముగుస్తుంది. 2022 టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు- నవంబరులో జరుగుతుంది. నవంబరు 13న ఫైనల్‌ ఉంటుంది. భారత్‌ ఆతిథ్యమిచ్చే 2023 వన్డే ప్రపంచకప్‌ కూడా అక్టోబరు- నవంబరులోనే నిర్వహిస్తారు. నవంబరు 26న ఫైనల్‌ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ నిర్వహణపై పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.