ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ను భారత్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుత భారత జట్టు అసాధారణంగా ఆడుతుందని కొనియాడాడు.
"గత ఆస్ట్రేలియా పర్యటనలో స్ఫూర్తిమంతమైన ప్రదర్శన చేసిన టీమ్ఇండియా.. ఇతర జట్లతో పోల్చితే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుత భారత జట్టు అసాధారణ ఆటతీరు కనబరుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మనదే అనిపిస్తుంది."
-సూర్యకుమార్ యాదవ్, యువ క్రికెటర్.
వచ్చేనెల ఇంగ్లాండ్తో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు ప్రకటించిన జట్టులో సూర్యకుమార్కూ చోటు కల్పించింది బీసీసీఐ. దీంతో ఆ సిరీస్తో పాటు వచ్చే ఐపీఎల్లో రాణిస్తే.. టీ20 ప్రపంచ కప్లోనూ చోటు దక్కే అవకాశం ఉంది.
ఎంఎస్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు.. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ వరల్డ్ కప్తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుపొందింది. అనంతరం మేజర్ ట్రోఫీల్లో రెండు సార్లు ఫైనల్ (2014 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ)కి, మరో మూడు సార్లు సెమీస్ (2015, 2019 వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్)కు వెళ్లింది.
ఇదీ చదవండి: వచ్చే నెలలో బాక్సింగ్ రింగ్లోకి విజేందర్