సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్మన్ కళ్లలో పడడం వల్ల క్రికెట్ మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. నేపియర్ వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇది జరిగింది. కివీస్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హారీస్ రౌఫ్ వేసిన నాలుగో బంతిని గ్రీన్ ఫిలిప్స్ సింగిల్ తీశాడు. కిరణాలు నేరుగా గ్రీన్ కళ్లలో పడటం వల్ల బౌలర్ వేసిన బంతిని ఎదుర్కోలేకపోయాడు. ఆ వెంటనే ఫీల్డ్ అంపైర్లు చర్చించుకొని కొద్దిసేపు ఆటను ఆపేశారు. ఆ తర్వాత యథావిధిగా కొనసాగించారు.
సూర్యుడి వల్ల ఆటను తాత్కాలికంగా నిలిపివేయడం నేపియర్ (మెక్లీన్ పార్క్) మైదానంలో రెండోసారి. 2019 జనవరిలో భారత్, కివీస్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో బ్యాట్స్మెన్ కళ్లలోకి సూర్య కిరణాలు పడుతున్నాయని మ్యాచ్ను కాసేపు ఆపారు. బ్యాటింగ్ చేస్తుండగా తన కళ్లలో వెలుగు పడుతుందని అప్పుడు శిఖర్ ధావన్ ఫిర్యాదు చేయడం వల్ల మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు.
ఇదీ చూడండి : స్మిత్కు కెప్టెన్సీ.. ఆసీస్ బోర్డు ఏమంటోంది?