ETV Bharat / sports

'ఆ మ్యాచ్​లో నా తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓడింది' - స్టీవ్ బక్నర్ అంపైర్ తప్పిదాలు

సిడ్నీ వేదికగా 2008లో భారత్​తో జరిగిన టెస్టు మ్యాచ్​లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమికి అంపైర్ల తప్పిదాలు కూడా కారణం. తాజాగా ఈ విషయంపై స్పందించాడు అంపైర్ స్టీవ్ బక్నర్.

'ఆ మ్యాచ్​లో నా తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓడింది'
'ఆ మ్యాచ్​లో నా తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓడింది'
author img

By

Published : Jul 19, 2020, 3:29 PM IST

సిడ్నీ వేదికగా 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్​ను టీమ్​ఇండియా అభిమానులు అంత తొందరగా మర్చిపోలేరు. అందుకు ఓ కారణం మంకీగేట్ వివాదం. ఆసీస్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్​పై హర్భజన్ సింగ్ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపణలు రావడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే అదే మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాలు భారత జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఈ మ్యాచ్​కు స్టీవ్ బక్నర్, మార్క్ బెన్సన్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తాజాగా ఆ మ్యాచ్​లో తాను రెండు తప్పులను చేసి భారత జట్టు ఓటమికి కారణమయ్యానని వెల్లడించాడు స్టీవ్ బక్నర్.

"2008లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో నేను రెండు తప్పులు చేశా. అందులో ఒకటి భారత్​ మ్యాచ్​పై ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆసీస్ అటగాడికి సెంచరీ చేసే అవకాశం కల్పించా. ఐదో రోజు నేను చేసిన తప్పు భారత ఓటమికి కారణమైంది. ఓ టెస్టులో రెండు తప్పులు చేసిన అంపైర్ నేనే కావొచ్చు. ఆ తప్పులు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి."

-స్టీవ్ బక్నర్, మాజీ అంపైర్

అయితే తన తప్పులను వెనకేసుకొచ్చాడు బక్నర్. కొన్నిసార్లు తప్పులు చేస్తామని.. వాటిని తెలుసుకుని మళ్లీ అదే మిస్టేక్​ని చేయకుండా ఉండాలని తెలిపాడు. "నేను తప్పులు చేయలేదు అని చెప్పట్లేదు. అయితే కొన్నిసార్లు గాలి ధ్వని పిచ్​ మీదుగా వెళ్లి మనకు తప్పుడు భావన కలిగించొచ్చు. అది చూసే వారికి అర్థం కాదు." అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. సైమండ్స్​ 162 పరుగులతో మెరిసి జట్టు 463 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సచిన్, లక్ష్మణ్​ శతకాలతో టీమ్​ఇండియా 532 పరుగులతో దీటైన రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్​లో 7 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. 332 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్​ 210 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాలపై భారత జట్టు ఫిర్యాదు కూడా చేసింది.

సిడ్నీ వేదికగా 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్​ను టీమ్​ఇండియా అభిమానులు అంత తొందరగా మర్చిపోలేరు. అందుకు ఓ కారణం మంకీగేట్ వివాదం. ఆసీస్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్​పై హర్భజన్ సింగ్ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపణలు రావడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే అదే మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాలు భారత జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఈ మ్యాచ్​కు స్టీవ్ బక్నర్, మార్క్ బెన్సన్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తాజాగా ఆ మ్యాచ్​లో తాను రెండు తప్పులను చేసి భారత జట్టు ఓటమికి కారణమయ్యానని వెల్లడించాడు స్టీవ్ బక్నర్.

"2008లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో నేను రెండు తప్పులు చేశా. అందులో ఒకటి భారత్​ మ్యాచ్​పై ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆసీస్ అటగాడికి సెంచరీ చేసే అవకాశం కల్పించా. ఐదో రోజు నేను చేసిన తప్పు భారత ఓటమికి కారణమైంది. ఓ టెస్టులో రెండు తప్పులు చేసిన అంపైర్ నేనే కావొచ్చు. ఆ తప్పులు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి."

-స్టీవ్ బక్నర్, మాజీ అంపైర్

అయితే తన తప్పులను వెనకేసుకొచ్చాడు బక్నర్. కొన్నిసార్లు తప్పులు చేస్తామని.. వాటిని తెలుసుకుని మళ్లీ అదే మిస్టేక్​ని చేయకుండా ఉండాలని తెలిపాడు. "నేను తప్పులు చేయలేదు అని చెప్పట్లేదు. అయితే కొన్నిసార్లు గాలి ధ్వని పిచ్​ మీదుగా వెళ్లి మనకు తప్పుడు భావన కలిగించొచ్చు. అది చూసే వారికి అర్థం కాదు." అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. సైమండ్స్​ 162 పరుగులతో మెరిసి జట్టు 463 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సచిన్, లక్ష్మణ్​ శతకాలతో టీమ్​ఇండియా 532 పరుగులతో దీటైన రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్​లో 7 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. 332 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్​ 210 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాలపై భారత జట్టు ఫిర్యాదు కూడా చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.