ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ.. కొత్త బృందమిదే..! - జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు) నామినేషన్‌ సమర్పించాడు. ఇంకా మహిమ్‌ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ (కోశాధికారి), బ్రిజేష్‌ పటేల్‌ (ఐపీఎల్‌ పాలకమండలి సభ్యుడు), జయేష్‌ జార్జ్‌ (సంయుక్త కార్యదర్శి), ఖైరుల్‌ మజుందార్‌ (పాలక మండలి సభ్యుడు), ప్రభ్‌జ్యోత్‌ సింగ్‌ (కౌన్సిలర్‌)

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీ నియామకం దాదాపు ఖరారైంది. ఆయనతో పాటు అపెక్స్​ కౌన్సిల్​లోని ఎనిమిది స్థానాలకు నామినేషన్​ తేదీ ముగిసింది. ఈనెల 23న వీరంతా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు దాదా.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ... కొత్త బృందమిదే...!
author img

By

Published : Oct 15, 2019, 6:00 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. ఈ సందర్భంగా అపెక్స్​ కౌన్సిల్​లో కొంత మంది సభ్యులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడీ మాజీ ఆటగాడు. "కొత్త జట్టు ఇదే.. అందరం కలిసి బాగా పనిచేస్తాం" అని సందేశమూ పెట్టాడు.

బృందమిదే...

బీసీసీఐ తొమ్మిది మంది సభ్యుల అత్యున్నత మండలిలో పదవుల కోసం గంగూలీతో పాటు మరి కొందరు నామినేషన్​ వేశారు. వారిలో కార్యదర్శి పదవికి జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు) నామినేషన్‌ సమర్పించాడు. ఇంకా మహిమ్‌ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ (కోశాధికారి), బ్రిజేష్‌ పటేల్‌ (ఐపీఎల్‌ పాలకమండలి సభ్యుడు), జయేష్‌ జార్జ్‌ (సంయుక్త కార్యదర్శి), ఖైరుల్‌ మజుందార్‌ (పాలక మండలి సభ్యుడు), ప్రభ్‌జ్యోత్‌ సింగ్‌ (కౌన్సిలర్‌) కూడా నామినేషన్లు వేశారు. వీళ్లందరి ఎన్నిక ఏకగ్రీవమని తెలుస్తోంది. బ్రిజేష్‌ పటేల్‌ ఐపీఎల్‌ ఛైర్మన్‌ కాబోతుండటం లాంఛనమైంది.

ఈనెల 23న ఫలితాలు...

నాటకీయ పరిణామాల మధ్య దేశంలోని అన్ని క్రికెట్‌ సంఘాలకూ ఆమోద యోగ్యమైన అభ్యర్థిగా మారిన గంగూలీ.. సోమవారం బోర్డు అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశాడు. అనుకున్నట్లే అతడికి పోటీ లేకపోయింది. ఇంకెవ్వరూ నామినేషన్‌ వేయలేదు. అధ్యక్షుడిగా దాదా ఎన్నిక ఖరారైంది. అయితే ఈ నెల 23న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా.. ఓటింగ్‌ ఏమీ లేకుండానే వీళ్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. ఈ సందర్భంగా అపెక్స్​ కౌన్సిల్​లో కొంత మంది సభ్యులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడీ మాజీ ఆటగాడు. "కొత్త జట్టు ఇదే.. అందరం కలిసి బాగా పనిచేస్తాం" అని సందేశమూ పెట్టాడు.

బృందమిదే...

బీసీసీఐ తొమ్మిది మంది సభ్యుల అత్యున్నత మండలిలో పదవుల కోసం గంగూలీతో పాటు మరి కొందరు నామినేషన్​ వేశారు. వారిలో కార్యదర్శి పదవికి జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు) నామినేషన్‌ సమర్పించాడు. ఇంకా మహిమ్‌ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ (కోశాధికారి), బ్రిజేష్‌ పటేల్‌ (ఐపీఎల్‌ పాలకమండలి సభ్యుడు), జయేష్‌ జార్జ్‌ (సంయుక్త కార్యదర్శి), ఖైరుల్‌ మజుందార్‌ (పాలక మండలి సభ్యుడు), ప్రభ్‌జ్యోత్‌ సింగ్‌ (కౌన్సిలర్‌) కూడా నామినేషన్లు వేశారు. వీళ్లందరి ఎన్నిక ఏకగ్రీవమని తెలుస్తోంది. బ్రిజేష్‌ పటేల్‌ ఐపీఎల్‌ ఛైర్మన్‌ కాబోతుండటం లాంఛనమైంది.

ఈనెల 23న ఫలితాలు...

నాటకీయ పరిణామాల మధ్య దేశంలోని అన్ని క్రికెట్‌ సంఘాలకూ ఆమోద యోగ్యమైన అభ్యర్థిగా మారిన గంగూలీ.. సోమవారం బోర్డు అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశాడు. అనుకున్నట్లే అతడికి పోటీ లేకపోయింది. ఇంకెవ్వరూ నామినేషన్‌ వేయలేదు. అధ్యక్షుడిగా దాదా ఎన్నిక ఖరారైంది. అయితే ఈ నెల 23న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా.. ఓటింగ్‌ ఏమీ లేకుండానే వీళ్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Pyongyang, North Korea. 15th October 2019.
1. 00:00 FIFA President Giovanni Infantino arriving at airport and shaking hands with Secretary General of North Korean Football Association Kim Jang San
2. 00:11 Wide of Infantino shaking hands with Kim Jang San
3. 00:16 Various of Infantino and Kim walking through airport VIP area
4. 00:39 Wide of Infantino and Kim lining up for group photo with accompanying officials
5. 00:49 Mid of Infantino and Kim
6. 00:54 Cutaway  
7. 01:00 Infantino and delegates  
8. 01:09 Official closes meeting room door
9. 01:15 Various of Infantino leaving airport
SOURCE: Associated Press
DURATION: 01:37
STORYLINE:
FIFA President Giovanni Infantino arrived in Pyongyang on Tuesday, as the North Korean and South Korean teams prepared for their historic  World Cup qualifier in the North's capital.
It's the first time in nearly 30 years that the national men's football teams of North and South Korea have played in Pyongyang.
Infantino is expected to watch the game on Tuesday before leaving Pyongyang later that day.
Previous FIFA President Sepp Blatter visited the North Korean capital in May 2002, just before South Korea and Japan held the World Cup.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.