టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ భారత జట్టును అభినందించాడు. 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించింది కోహ్లీసేన. తద్వారా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్లు గెలుపొందిన జట్టుగా నిలిచింది. ఈ ఘనత సాధించేందుకు ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు.
పుణె టెస్టులో కెప్టెన్ కోహ్లీ(254*) వీరోచితంగా ఆడి కెరీర్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. అనంతరం 601/5తో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది టీమిండియా. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌట్ అయింది. పర్యటక జట్టును ఫాల్ఆన్కు ఆహ్వానించాడు భారత కెప్టెన్. రెండో ఇన్నింగ్స్లోనూ టీమిండియా బౌలర్లు విజృంభించడం వల్ల డుప్లెసిస్ సేన 189 పరుగులకే కుప్పకూలి సిరీస్ను చేజార్చుకుంది.
టీమిండియా కెప్టెన్ ఈ మ్యాచ్తో పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మాజీ సారథి ధోనీ తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ.. 2015 నుంచి స్వదేశంలో జరిగిన ప్రతి టెస్టు సిరీస్ను గెలిపించాడు.