క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రస్తుతం కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడనే సమాచారం చెప్పకపోయినా తన కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు. తొలుత తానొక్కడే సైక్లింగ్ చేస్తున్న ఫొటోలు పంచుకున్న లిటిల్ మాస్టర్.. ఆ తర్వాత కుమారుడు అర్జున్తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశాడు. అనంతరం పారా సెయిలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేయగా.. తాజాగా సముద్రంలో తన గారాలపట్టి సారాతో కలిసి బోటింగ్కు వెళ్లిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తండ్రీకూతుళ్లిద్దరూ లైఫ్ జాకెట్స్ ధరించి కళ్లద్దాలు పెట్టుకొని పడవలో వెళ్తుండగా ఆ ఫొటో తీసుకున్నారు. సచిన్ దాన్ని ఇన్స్టాలో పంచుకుంటూ "సారా: బాబా.. మనం సముద్రంలో తప్పిపోయామా?" అని అడిగితే.. "నాకూ కచ్చితంగా తెలియదు" అని సరదాగా బదులిచ్చాడు. కరోనా కారణంగా మార్చిలో లాక్డౌన్ విధించినప్పటి నుంచీ ఇంట్లోనే ఉంటున్న సచిన్ ఇటీవలే బయటకు రావడం మొదలుపెట్టాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">