ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. మంచి ఫామ్లో ఉన్న హిట్మ్యాన్.. కటక్ వేదికగా విండీస్తో జరుగుతున్న చివరి వన్డేలో మరో ప్రపంచ రికార్డు సాధించాడు. శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య నమోదు చేసిన ఓ రికార్డును 22 ఏళ్ల తర్వాత బ్రేక్ చేశాడు రోహిత్. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్గా కొత్త అధ్యాయం లిఖించాడు.
9 పరుగుల్లోనే...
జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్లో ఐదు శతకాలతో జోరు చూపించిన రోహిత్ శర్మ ఆ తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ.. తాజాగా వెస్టిండీస్తో వన్డే సిరీస్లో శతకం సాధించాడు. ఈరోజు కటక్లో ఆఖరి వన్డేలో 63 పరుగులు చేసిన హిట్మ్యాన్.. ఈ ఏడాది ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 2,442 రన్స్ చేశాడు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్గా అరుదైన ఘనత సాధించాడు.
-
Rohit Sharma's great run of form continues as he notches up yet another FIFTY in ODIs.
— BCCI (@BCCI) December 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/kK8v4xbyB7 #INDvWI pic.twitter.com/GLNdxFz9Hq
">Rohit Sharma's great run of form continues as he notches up yet another FIFTY in ODIs.
— BCCI (@BCCI) December 22, 2019
Live - https://t.co/kK8v4xbyB7 #INDvWI pic.twitter.com/GLNdxFz9HqRohit Sharma's great run of form continues as he notches up yet another FIFTY in ODIs.
— BCCI (@BCCI) December 22, 2019
Live - https://t.co/kK8v4xbyB7 #INDvWI pic.twitter.com/GLNdxFz9Hq
శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య 1997లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 2,387 పరుగులు చేయగా.. అప్పటి నుంచి ఈ రికార్డ్ను ఏ క్రికెటర్ అందుకోలేకపోయాడు. కానీ ఈ ఏడాది కెరీర్లోనే బెస్ట్ ఫామ్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు.
ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా నెం.1 స్థానంలో ఉన్నాడు రోహిత్.