ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: రాజస్థాన్ రాయల్స్​కు మరో సొంత మైదానం

author img

By

Published : Feb 27, 2020, 4:21 PM IST

Updated : Mar 2, 2020, 6:35 PM IST

ఐపీఎల్​-2020 సీజన్​ కోసం మరో కొత్త మైదానం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ ఆడే రెండు లీగ్​ మ్యాచ్​లను జైపుర్​లో కాకుండా గువాహటిలో నిర్వహించనున్నారు.

ఐపీఎల్​ 2020: రాజస్థాన్ రాయల్స్​కు మరో సొంత మైదానం
రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం మరో కొత్త మైదానం సిద్ధమైంది. ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైన గువాహటిలోని బర్సపరా స్టేడియం.. ఈసారి నుంచి ఐపీఎల్​ మ్యాచ్​లకూ ఆతిథ్యమివ్వనుంది. ఈ సీజన్​లో రెండు మ్యాచ్​లను ఇక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ తాజాగా అనుమతిచ్చింది.

రాజస్థాన్​ రాయల్స్​ మ్యాచ్​లు

రాజస్థాన్​ రాయల్స్​ తలపడే రెండు లీగ్​ మ్యాచ్​లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి. రెండో సొంత మైదానంగా దీనిని భావిస్తోంది రాజస్థాన్ యాజమాన్యం. ఏప్రిల్‌ 5న దిల్లీ క్యాపిటల్స్‌తో, ఏప్రిల్​ 8న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లు ఈ వేదికపై జరగనున్నట్లు ఐపీఎల్​ నిర్వాహకులు ప్రకటించారు. ఈ రెండూ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Guwahati barspara ground
గువహటిలోని బర్సపరా మైదానం

ఐపీఎల్‌-2020 ఆరంభ మ్యాచ్‌ వచ్చే నెల 29న వాంఖడే వేదికగా జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఈ మ్యాచ్​లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ దశ 50 రోజులుపాటు జరిగి మే 17న ముగుస్తుంది. ఆ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లు, మే 24న ఫైనల్‌ జరగనుంది.

ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం మరో కొత్త మైదానం సిద్ధమైంది. ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైన గువాహటిలోని బర్సపరా స్టేడియం.. ఈసారి నుంచి ఐపీఎల్​ మ్యాచ్​లకూ ఆతిథ్యమివ్వనుంది. ఈ సీజన్​లో రెండు మ్యాచ్​లను ఇక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ తాజాగా అనుమతిచ్చింది.

రాజస్థాన్​ రాయల్స్​ మ్యాచ్​లు

రాజస్థాన్​ రాయల్స్​ తలపడే రెండు లీగ్​ మ్యాచ్​లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి. రెండో సొంత మైదానంగా దీనిని భావిస్తోంది రాజస్థాన్ యాజమాన్యం. ఏప్రిల్‌ 5న దిల్లీ క్యాపిటల్స్‌తో, ఏప్రిల్​ 8న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లు ఈ వేదికపై జరగనున్నట్లు ఐపీఎల్​ నిర్వాహకులు ప్రకటించారు. ఈ రెండూ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Guwahati barspara ground
గువహటిలోని బర్సపరా మైదానం

ఐపీఎల్‌-2020 ఆరంభ మ్యాచ్‌ వచ్చే నెల 29న వాంఖడే వేదికగా జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఈ మ్యాచ్​లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ దశ 50 రోజులుపాటు జరిగి మే 17న ముగుస్తుంది. ఆ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లు, మే 24న ఫైనల్‌ జరగనుంది.

Last Updated : Mar 2, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.